logo

కిరాణా దుకాణం మాటున మద్యం విక్రయాలు

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని వాఘాపూర్‌లో కిరాణా దుకాణం మాటున మద్యం విక్రయాలను పోలీసులు శనివారం గుర్తించారు.

Published : 04 May 2024 22:03 IST

ఎదులాపురం: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని వాఘాపూర్‌లో కిరాణా దుకాణం మాటున మద్యం విక్రయాలను పోలీసులు శనివారం గుర్తించారు. ఆ గ్రామానికి చెందిన బండి దేవన్న అనే వ్యక్తి తన కిరాణా దుకాణంలో మద్యం విక్రయాలు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయగా 17 లీటర్ల మద్యం గుర్తించినట్లు ఎస్సై వంగ విష్ణువర్ధన్ తెలిపారు. రూ.20వేల విలువగల 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని విక్రయదారునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని