కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం.
అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
కాగజ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. అయితే ఆర్థిక, రాజకీయ అండ కలిగిన వారు సర్కారు స్థలాలను దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నా.. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాలకు సమీపంలో, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాలకు డిమాండ్ ఉండటంతో.. పలువురు అక్రమార్కులు వాటిపై కన్నేశారు. ఇలా కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల పక్కన ఉన్న సర్కారు భూములు ఇప్పటికే కబ్జాదార్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. మిగిలి ఉన్న గుంట, అరగుంట స్థలం కూడా ఈ మధ్యకాలంలో కబ్జాలోకి వెళ్తోంది.
కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని కాగజ్నగర్-పెంచికల్పేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇళ్ల స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ రహదారి పక్కనే ఈజ్గాం శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నం.34ని ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకున్నారు. ఇదే సర్వే నంబరులో 50 మంది పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో.. ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ కాలనీకి పంచశీలనగర్గా నామకరణం జరిగింది. ఈ కాలనీకి ఆనుకొని ఉన్న సర్వే నం.34 ప్రభుత్వ మిగులు భూమిని రాజకీయ పలుకుబడి కలిగిన పలువురు తమ ఆధీనంలోకి తీసుకొని విక్రయించుకుంటున్నారు. పంచశీలనగర్ ప్రభుత్వ భూమిలోనే నివాసముంటున్న ఓ వ్యక్తి తన ఇంటిని అనుకొని ఉన్న సర్వే నం.34 ప్రభుత్వ భూమిలోని రెండు గుంటలను ఆక్రమించుకున్నాడు. తదనంతరం మరొక వ్యక్తికి లక్షలాది రూపాయలకు విక్రయించాడు. వీటికి ఎలాంటి హక్కు పత్రాలు లేవు. ఈ స్థలం కొనుగోలు చేసిన వ్యక్తికి ఎలాంటి పత్రాలు, రిజిస్ట్రేషన్ కూడా లేదు. ఈజ్గాం పంచాయతీ అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం కూడా చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఈ విషయంపై తహసీల్దార్ కిరణ్కుమార్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
గువ్వలగూడలో రహదారి ఆక్రమణ
కాగజ్నగర్-పెంచికల్పేట ప్రధాన రహదారి పక్కన కాగజ్నగర్ మండలంలో గువ్వలగూడ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రహదారి పక్కనే పలువురు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్నారు. గువ్వలగూడనుంచి దహెగాం మండలం ఇట్యాలకు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి ఏకంగా రహదారి స్థలాన్ని ఆక్రమించుకుని సిమెంట్ స్తంభాలు పాతుకున్నాడు. నిత్యం రాకపోకలతోపాటు వ్యవసాయ పనులకు వెళ్లే దారిని మూసివేసే యత్నంలోనే భాగంగా కబ్జాకు పాల్పడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొదటి త్రిపుల్ తలాక్ కేసు నమోదు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో త్రిపుల్ తలాక్ మొదటి కేసు అదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో శనివారం నమోదైంది. -
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం