అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది.
మంచిర్యాలలో కేసీఆర్ రోడ్షో విజయవంతం
మంచిర్యాల పట్టణం, మంచిర్యాల సిటీ, మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. ఈ రోజు మంచిర్యాల జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన అభిమానులంతా మండుటెండలోనూ తరలివచ్చారని కేసీఆర్ కొనియాడారు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డా ఓపికగా కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. భారాస ప్రభుత్వంలో తాగునీరు, కరెంట్, అభివృద్ధి ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని అప్పటి ఇప్పటి పరిస్థితులను కేసీఆర్ ప్రజలకు వివరించారు. అయిదు నెలల్లో ఎలా ఆగం అయ్యాం.. మంచిర్యాల జిల్లా ఉండాలన్నా, రైతుబంధు యథావిదిగా రావాలన్నా భారాసకు పట్టం కట్టాలి. జిల్లా కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న సమీకృత మార్కెట్ సముదాయం పనులను ఎందుకు ఆపారు. భారాస హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిలిపివేసి పురోగతికి ఆటంకం కల్పిస్తున్నారు.. అంటూ సమస్యలపై కేసీఆర్ ప్రసంగించినప్పుడు భారాస శ్రేణుల్లో జోష్ కన్పించింది.
ప్రజలకు బస్సులో నుంచి నమస్కరిస్తున్న కేసీఆర్, ఈశ్వర్
పల్లె, పట్టణ ప్రగతిపై జిల్లాలో పట్టణాలు ఎక్కువగా ఉండటంతో భారాస హయాంలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి గురించి వివరించారు. ప్రస్తుతం పల్లెల అభివృద్ధికి నిదులు ఇవ్వడం లేదు. హరితహారం మొక్కలు, పల్లె ప్రకృతివనాలు ఎండిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో మొక్కలు మొలుస్తున్నాయి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తుందని దుయ్యబట్టారు.
- ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డిపై తనదైన శైలిలో ప్రసంగించడంతో కార్యకర్తలు జేజేలు కొట్టారు. మీకు రైతుబంధు వస్తుందా.. రుణమాఫీ చేశారా.. కల్యాణలక్ష్మి తులం బంగారం ఇచ్చారా, రంజాన్ తోఫా ఇచ్చారా, ప్రధాని మోదీ ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇచ్చారా అంటూ కేసీఆర్ ప్రజలను అడగగా ఇవ్వలేదంటూ సమాధానం ఇచ్చారు.
- గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు ఆసుపత్రుల పాలవుతున్నారని విద్యార్థుల సమస్యలను ప్రస్తావించారు.
- సాయంత్రం అయిదు గంటల నుంచి కేసీఆర్ మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు వచ్చే వరకు కళాకారులు ఆటపాటలతో కార్యకర్తల్లో హుషారునింపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని పొగుడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు వివరిస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో తరలించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా పూర్తిగా జనంతో నిండిపోయింది. కళాకారులు పాడే పాటలతో వేదిక ముందున్న కార్యకర్తలు గులాబీ కండువాలు ఊపుతూ నృత్యాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొదటి త్రిపుల్ తలాక్ కేసు నమోదు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో త్రిపుల్ తలాక్ మొదటి కేసు అదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో శనివారం నమోదైంది. -
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు