logo

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

తాంసి మండలం పొన్నారి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Published : 05 May 2024 12:45 IST

తాంసి: తాంసి మండలం పొన్నారి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు చెందిన కరణ్, సయ్యద్ బబ్లు, అజీమ్ ఆదివారం తెల్లవారుజామున పున్నాగ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డుపైకి ఒక్కసారిగా వచ్చిన అడవి పందిని తప్పించబోయి ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పొన్నారి గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం అందించి, క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని