డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్’
ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది.
6 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కాగజ్నగర్, న్యూస్టుడే: ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. విద్యార్థులు ఆధార్ కార్డుకు మొబైల్ నంబరు అనుసంధానమై ఉండాలి. లింక్ ద్వారా ఓటీపీ నమోదు చేసుకుని ప్రవేశ ప్రక్రియ ప్రారంభించవచ్చు. విద్యార్థులు రిజిస్ట్రేషన్కు ఇంటర్నెట్, మీ-సేవా కేంద్రాలను నుంచి దరఖాస్తు చేసుకోవాలి. జులై 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా.. 20కి పైనే ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం వివిధ కోర్సుల్లో 15వేలకు పైనే సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సహాయ కేంద్రం ఏర్పాటు
కుమురం భీం జిల్లాలోని కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో దోస్త్ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దోస్త్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు హెల్ప్లైన్ సెంటర్ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడంతోపాటు విద్యార్థులకు మార్గదర్శకం అందిస్తారు.
అవసరమైన ధ్రువపత్రాలు
విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్ హాల్టికెట్ నంబరు, కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, ఆధార్కార్డుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం తమ హాల్టికెట్ నంబరుతో దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు.
మూడు దశల్లో సీట్ల కేటాయింపు
డిగ్రీ కళాశాలల్లో భర్తీకి తొలి దశ రిజిస్ట్రేషన్లు ఈ నెల 6 నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతాయి. రూ.200 రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 15-27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 3న దోస్త్ మొదటి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్ 4-10 మధ్యలో కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
- రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4-13 వరకు నిర్వహిస్తారు. రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్ 4-14 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. అదే నెల 18న సీట్ల కేటాయింపు, 19-24 మధ్యలో కళాశాలలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
- మూడో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 13-25 వరకు జరగనున్నాయి. రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్. జూన్ 19-25 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం. 28న మూడో దశ సీట్ల కేటాయింపు. 29 నుంచి జులై 3వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.
- జూన్ 29 జులై 5వ తేదీ మధ్యలో డిగ్రీ సీట్లు పొందిన వారంతా కళాశాలలో రిపోర్ట్ చేయాలి. జులై 1 నుంచి కళాశాల్లో పునరుశ్చరణ జరుగుతుంది. జులై 8 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
- లక్ష్మినరసింహం, ప్రిన్సిపల్, డిగ్రీ కళాశాల, కాగజ్నగర్
డిగ్రీ కోర్సులకు ఇంజినీరింగు కోర్సులతో సమానంగా ఆదరణ ఉంది. ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటోంది. ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత అయిన వారు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరి, ఉన్నత విద్యతోపాటు, ఉన్నత స్థాయి ఉద్యోగాలకు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో మొదటి త్రిపుల్ తలాక్ కేసు నమోదు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో త్రిపుల్ తలాక్ మొదటి కేసు అదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో శనివారం నమోదైంది. -
భ్రూణహత్యల నివారణపై అవగాహన
[ 18-05-2024]
భ్రూణ హత్యల కట్టడికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.సాధన సూచించారు. -
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్