వసతులు లేక ఇక్కట్లు
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు.
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు తప్పని అవస్థలు
ఇళ్ల మధ్య మురుగు దుస్థితి
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. దరఖాస్తులదారుల్లోంచి లక్కీ డ్రా విధానంలో అర్హులను ఎంపికచేసి సుమారు 1,500 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. ఇది జరిగి దాదాపు ఆరేడు నెలలవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ ప్రాంతంలో ఇప్పటికీ సరైన వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మురుగుమయం..
పెద్దమొత్తంలో కుటుంబాలు నివాసం ఉండటంతో ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగును సక్రమంగా బయటకు తరలించేందుకు ఏర్పాటుచేసిన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా మురుగంతా బయటకు చేరి ఇళ్లమధ్య నిల్వఉంటోంది. ఫలితంగా దోమలబెడద పెరుగుతోంది. చెత్తసేకరణకు మున్సిపల్ వాహనాలు సక్రమంగా వచ్చిన దాఖలాలు లేకపోవడంతో ఆరుబయట పడేస్తున్నారు. దీనివల్ల చెత్త పోగవుతోంది. మొత్తంగా పారిశుద్ధ్యం దెబ్బతినడంతో వ్యాధుల వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
రోడ్డు దుస్థితి ఇలా..
రహదారుల్లేవు..
కాలనీలో అంతర్గత రహదారుల్లేవు. మట్టిరోడ్లే కావడంతో చాలావరకు గుంతలమయంగా మారాయి. వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. మహాలక్ష్మి ఆలయ సమీపంలోని రెండుపడక గదుల ఇళ్లకు వెళ్లే ప్రధానమార్గం చూస్తే విషయం అర్థమవుతోంది. దీనికితోడు మురుగునీరు చేరడంతో ఈ రోడ్డువెంట వాహనాలను నడపడం చోదకులకు నరకప్రాయంగా మారుతోంది. విద్యుద్దీపాల సమస్య లేకపోయినా.. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి వెళ్లే ప్రధాన రోడ్డులో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన రోజు మినహా ఎప్పుడూ వెలగడం లేదని, ఫలితంగా ఈ మార్గమంతా అంధకారం నెలకొంటోందని పేర్కొంటున్నారు.
తాగునీటికి..
నూతనంగా ఏర్పడిన ఈ కాలనీల్లో నీటి అవసరాలకు ఇబ్బందులు తప్పటం లేదు. మిషన్ భగీరథ పథకం కింద నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో నీరు రంగుమారి వస్తోందని, ఫలితంగా తాగేందుకు అవకాశం లేకుండాపోతోందని మండిపడుతున్నారు. చేతిపంపులు సరిపడా ఏర్పాటుచేయకపోవడంతో ఉన్నచోట నీటికోసం పడిగాపులు తప్పటం లేదు. కొంతమంది బ్లాక్ల వారీగా తమ ప్రాంతంలో సొంత ఖర్చులతో బోర్లు వేయించుకొని నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?