logo

మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీని గెలిపించాలి

దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు రాజు కోరారు.

Updated : 06 May 2024 16:12 IST

తాంసి: దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు రాజు కోరారు. సోమవారం అదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని, కమలం పువ్వుకు ఓటు వేసి, ఎంపీగా గోడం నగేష్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సదానందం, నారాయణ, సుభాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని