logo

అత్యధిక కేసుల పరిష్కారానికి కృషి చేద్దాం

జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు సూచించారు.

Updated : 07 May 2024 15:36 IST

ఎదులాపురం: జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు సూచించారు. వచ్చేనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని మంగళవారం కోర్ట్ హాల్‌లో న్యాయవాదులు, బీమా సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు అందించిన సూచనలను స్వీకరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కక్షిదారుల పరస్పర అంగీకారంతో సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని