మాయ లేడి
ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది.
ఉద్యోగాల పేరిట బురిడీ
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది. వారి నుంచి డబ్బులు వసూలుచేసి, ఆతర్వాత ఉద్యోగం ఇప్పించకుండా కాలం గడిపేది. ఇదేంటని ప్రశ్నించినవారికి డబ్బులు చెల్లిస్తానని, ఓపికగా ఉండాలని సర్దిచెప్పేది. చూసీచూసీ విసిగిపోయిన బాధితులు తామంతా మోసపోయినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.లక్షల్లో వసూలు..
పట్టణానికి చెందిన ఓ మహిళ ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటం లేదు. చాలాచోట్ల పొరుగుసేవల విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని.. ఏజెన్సీ నుంచి ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ సదరు మహిళ తెలిసినవారిని నమ్మించింది. వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగమంటూ ఒక్కొక్కరి నుంచి సగటున రూ.3 లక్షల వరకు వసూలుచేసింది. కొందరికి కేంద్ర రైల్వేవిభాగంలో ఉద్యోగమని చెప్పి రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా పదులసంఖ్యలో ఆశావహుల నుంచి రూ.లక్షల్లో వసూలుచేసింది. వారిలో మరింత నమ్మకం కలిగేందుకు డబ్బు అప్పుగా తీసుకుంటున్నానని, కొద్దిరోజుల్లోనే చెల్లిస్తానంటూ బాండ్ పేపర్లు సైతం రాసివ్వడం గమనార్హం. డబ్బులిచ్చిన నెలరోజుల్లోపు ఉద్యోగం వస్తుందని, నియామకపత్రం చేతికిస్తామని చెప్పడంతో చాలామంది ఆశగా చెల్లించారు. కానీ, ఆ తర్వాత రోజులు గడుస్తున్నా స్పందన లేకపోవడం, ఉద్యోగ నియామక అవకాశం రాకపోవడంతో వారంతా బిత్తరపోతున్నారు. దాదాపు ఏడాదికాలంగా ఈ తతంగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
నకిలీ పత్రాలతో..
పట్టణానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగి. ఉద్యోగం వస్తుందన్న ఆశతో దాదాపు అయిదునెలల క్రితం రూ. 2.30 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత అతడికి పొరుగుజిల్లాకు చెందిన ఓ ఏజెన్సీ నుంచి ఉద్యోగ నియామకపత్రం అందించారు. వారు చెప్పిన కార్యాలయానికి వెళ్లి ఉద్యోగంలో చేరేందుకు అంగీకరిస్తూ సంతకం చేసొచ్చాడు. రెండు, మూడురోజుల్లో కాల్చేస్తామని చెప్పి వారు ఆ విషయం మర్చిపోయారు. తీరా చూస్తే ఆ ఉద్యోగంలో మరొకరు చేరినట్లు తెలిసింది. ఒకే నియామక ఉత్తర్వును ముగ్గురికి ఇచ్చినట్లు గుర్తించి అవాక్కయ్యాడు. ఏది నకిలో, ఏది నిజమో తెలియక తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, లేకపోతే ఉద్యోగం ఇప్పించాలంటూ సదరు మహిళను ఆశ్రయించాడు. ఆమె వ్యవహారం అనుమానంగా ఉండటంతో మోసపోయామని గుర్తించారు. డబ్బులు ఇచ్చేస్తానని, ఓపికగా ఉండకపోతే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెడుతోందంటూ బాధితులు వాపోవడం గమనార్హం.
- మరో ఇద్దరు బాధితులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు అందించింది. ఎందుకైనా మంచిదని, సదరు బ్యాంకులో ఆ చెక్కు గురించి వాకబుచేస్తే.. సంతకం నకిలీదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తాము హతాశులయ్యామని బాధితులు పేర్కొంటున్నారు. సుమారు రూ. కోటికి పైగానే ఇలా వసూలుచేసి అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోందని, డబ్బులివ్వకుండా వేధిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!