మెజార్టీయే లక్ష్యం
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు
న్యూస్టుడే, నిర్మల్: లోక్సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్, భారాస మధ్యే ముక్కోణపు పోటీ నెలకొనడంతో తమకు అత్యధిక ఓట్లు వచ్చేలా ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పట్టణ, మండల, గ్రామాల వారీగా పార్టీల ముఖ్య నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించి ప్రచారం చేయిస్తున్నారు.
నిర్మల్, ముథోల్పైనే పార్టీల దృష్టి 2019లో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భాజపా కైవసం చేసుకోవడంలో నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల ఓట్లు కీలకమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనే భాజపాకు 45,492 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకున్న భాజపా ఓట్ల ఆధిక్యతను మరోసారి చూపించింది. ఈ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో ఆ పార్టీకి 1,06,400 ఓట్లు రాగా మొత్తం పోలైన ఓట్లలో 54.03 శాతంతో 50,703 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. రెండోస్థానంలో భారాసకు 55,697, మూడో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్కు 28,642 ఓట్లు వచ్చాయి. ముథోల్ నియోజకవర్గంలోనూ భాజపాకు 98,252 ఓట్లు రాగా మొత్తం పోలైన ఓట్లలో 48.59 శాతంతో 23,999 ఆధిక్యత సాధించింది. రెండోస్థానంలో భారాసకు 74,253, మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్కు 15,588 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భాజపా మరింత భారీ మెజార్టీ సాధించేలా పక్కా ప్రణాళికలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో భాజపాకు వచ్చిన ఓట్లకు గండి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూనే ఈ సారి మెజార్టీ సాధించాలన్న సంకల్పంతో ముందుకెళుతోంది. ఈమేరకు నిర్మల్లో రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిలతో బహిరంగ సభ నిర్వహించింది. భారాస గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి ఐకేరెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ ఛైర్మన్ అప్పాల గణేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రాజేందర్, పలు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పార్టీని వీడినా కార్యకర్తలు తమ వెంట ఉన్నారన్న ధీమా భారాసలో కనిపిస్తోంది. నిర్మల్, భైంసా పట్టణాల్లో గురువారం కేటీఆర్తో రోడ్షో తలపెట్టింది.
ఎవరికి వారే..
లోక్సభ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో బృందాలుగా ఏర్పడి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు పట్టణ, గ్రామాల్లోని సామాజిక వర్గాల వారీగా కుల సంఘాలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉదయం సమయాల్లో ఉపాధి పనులు జరిగిన చోటకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం కోసం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పలుమార్లు ఈ రెండు నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహించి ప్రచారశైలిపై దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఐకేరెడ్డి, ముథోల్లోనూ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణరావుపటేల్, ఇతర పార్టీ ముఖ్యులు ఎవరికి వారే ప్రచారం చేస్తున్నారు. ఇక భాజపాలో అన్నీ తానై చూసుకుంటున్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఈ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీకి మించేలా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. గోడం నగేశ్ గెలుపు కోసం గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్, భారాసల వైఖరి ఎండగడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ముథోల్లోనూ ఆధిక్యత తగ్గకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్తోపాటు ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. భారాస పార్టీ భాజపా, కాంగ్రెస్లకు దీటుగా ప్రచారం కొనసాగిస్తోంది. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తల బలం ఉందన్న ధీమాతో ప్రచారం చేస్తున్నారు. నిర్మల్లో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి, ఇన్ఛార్జి యూనుస్ అక్బానీ, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, తదితర నేతలు, ముథోల్లో పార్టీ సమన్వయ కమిటీ బాధ్యులు పడకంటి రమాదేవి, విలాస్ గాదేవార్, లోలం శ్యాంసుందర్, డా.కిరణ్కుమార్ కొమ్రెవార్, తదితర నాయకులు ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంతో అంతటా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!