logo

త్వరలోనే రైతు రుణమాఫీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే  రైతు రుణమాఫీ చేస్తుందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు.

Published : 08 May 2024 12:14 IST

తాంసి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే  రైతు రుణమాఫీ చేస్తుందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తాంసీ మండలం కప్పర్ల లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ఆయన వెంట నాయకులు నారాయణ, సంతోష్, నరేష్ బాబు, ధనుంజయ్, రామన్న యాదవ్, గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, రామయ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు