logo

కాంగ్రెస్‌కే మాదిగ ఐకాస మద్దతు

రాజ్యాంగ రక్షణ, ఎస్సీ వర్గీకరణ కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని, అందుకే మాదిగ ఐకాస లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తీర్మానించిందని ఐకాస అధ్యక్షుడు మల్యాల మనోజ్ కుమార్ స్పష్టం చేశారు.

Published : 08 May 2024 19:15 IST

ఎదులాపురం: రాజ్యాంగ రక్షణ, ఎస్సీ వర్గీకరణ కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని, అందుకే మాదిగ ఐకాస లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తీర్మానించిందని ఐకాస అధ్యక్షుడు మల్యాల మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో వర్గీకరణ కోసం భాజపా హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడే తన సొంత ఆర్థిక లబ్ధి కోసం మందకృష్ణ వర్గీకరణ ఊసెత్తుకుంటారని విమర్శించారు. మైనార్టీల హక్కులను కాలరాసే భాజపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని