logo

జిల్లా కేంద్రంలో ఓటరు అవగాహన ర్యాలీ

జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Published : 08 May 2024 19:21 IST

అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహాలక్ష్మి వాడ, భాగ్యనగర్, తాటిగూడ, క్రాంతినగర్, జై జవాన్ నగర్ కాలనీలో ఓటు హక్కు, ప్రాధాన్యత గురించి పాటల ద్వారా వివరించారు. మే 13న అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది భాగ్యలక్ష్మి, పన్నాలాల్, సందీప్ రెడ్డి, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని