ఇక రెండు రోజులే..
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది.
ముమ్మరంగా ప్రధాన పార్టీల ప్రచారం
ఈనాడు, ఆసిఫాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు మండల కేంద్రాలు, గ్రామాలను సుడిగాలిలా చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటు వేసి, తమకే మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. పోటాపోటీగా సభలు, సమావేశాలు ఏర్పాటు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సంపూర్ణంగా ఓటర్లు గంపగుత్తగా తమకే ఓటు వేసేలా తీర్మానాలు సైతం చేసుకుంటున్నారు. ఇలా తీసుకున్న నేతలు ఈ ప్రాంతాలను వదిలేసి, మిగతా చోట్ల ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఉదయం నుంచి పగలంతా ప్రచారం చేస్తూ.. రాత్రి వేళల్లో కులపెద్దలు, సంఘాలు, గ్రామ పటేళ్లను కలుస్తున్నారు. ఓటేస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
మంత్రి అన్నీ తానై..
జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క.. జిల్లాలోని అన్ని మండలాలను కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఇప్పటికే చుట్టేశారు. మంత్రి మారుమూల గ్రామాలను సైతం వదలకుండా ప్రచారం నిర్వహించారు. కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లోని అసమ్మతి నేతలను బుజ్జగించడంతో పాటు, ఇతర పార్టీల నుంచి గణనీయంగా నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అజ్మీరా శ్యామ్నాయక్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ చేరోవైపు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మండల స్థాయి నేతలు, కొందరు జడ్పీటీసీ సభ్యులు ఆయా మండలాల్లో విస్తృతంగా ఓటర్ల వద్దకు వెళ్లి, ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. అభ్యర్థి ఆత్రం సుగుణ సొంత గ్రామం సిర్పూర్(యు), జైనూర్ మండలాల సరిహద్దుల్లో ఉంటూ.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని స్థానిక వ్యక్తికి మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు.
- కాంగ్రెస్ నుంచి మంత్రి సీతక్క జిల్లా అంతటా పర్యటించగా, సిర్పూర్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్లు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సైతం హస్తం శ్రేణుల్లో జోష్ నింపింది.
భారాస ఇలా..
గురువారం సాయంత్రం ఆసిఫాబాద్లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్షో ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అనంతరం సమయాభావంతో రావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు వంటి వారు ఎవరూ జిల్లాలో ప్రచారం చేయకపోవడం వల్ల కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాల్లో సభలను నిర్వహిస్తూ, చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
భాజపా దూకుడు..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సభ విజయవంతం కావడం వల్ల కమలనాథులు ప్రచార దూకుడు పెంచారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, నేతలు కొత్తపల్లి శ్రీనివాస్, కోట్నాక విజయ్కుమార్లు రెండు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చిన్నపాటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రధాని మోదీ విశిష్టతను వివరిస్తున్నారు. ఆసిఫాబాద్ జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు భారాస నుంచి భాజపాలో చేరడంతో కొన్ని మండలాల్లో బలోపేతం అయినట్లుగా పార్టీ శ్రేణులు భావించాయి. అయితే భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆజ్మీరా ఆత్మారామ్ నాయక్, తన మద్దతుదారులతో గురువారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆత్మారాం నాయక్ రెండుసార్లు ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ మారడం భాజపాకు ఏ మేరకు నష్టమనే చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు