జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది.
నిరుపయోగంగా సంపద కేంద్రాలు
చింతపల్లిలో పేరుకుపోతున్న పాలిథిన్ వ్యర్థాలు
చింతపల్లి, న్యూస్టుడే: చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. ఈ కేంద్రానికి పలు విడతలుగా ఇప్పటివరకూ సుమారు రూ.10 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులకు కాసులు పండించింది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక పంచాయతీల్లో నిర్మించిన సంపద కేంద్రాలు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.
చింతపల్లిలో సంపద కేంద్రం
చింతపల్లి మండలంలో 17 పంచాయతీలున్నాయి. వీటిలో చింతపల్లి ఒక్కటే మేజరు పంచాయతీ. సుమారు 14వేల మంది పైచిలుకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. నిత్యం చింతపల్లి వచ్చి వెళ్లేవారి సంఖ్య మూడు వేల నుంచి ఐదు వేల మధ్య ఉంటుంది. దీంతో ఇక్కడ చెత్త సమస్య అధికంగా ఉంటోంది. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత పంచాయతీకి పెద్ద సవాలుగా మారింది. కొద్దికాలం క్రితం వరకూ ఒక ఎడ్లబండి, ఐదుగురు సిబ్బందితోనే నెట్టుకొచ్చేవారు. స్వచ్ఛభారత్ మిషన్లో రెండు ట్రాక్టర్లు వచ్చాయి. అయినా తగినంత పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో వీధులన్నీ చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించే లక్ష్యంతో చింతపల్లిలో ఏర్పాటు చేసిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం వినియోగంలోకి వచ్చినా దీని ద్వారా ఆదాయం ఏమీ రావడం లేదు. ఇక మండలంలో నిర్మించిన 14 సంపద కేంద్రాలు నిరుపయోగంగానే ఉంటున్నాయి.
కార్మికులకు వేతనాల్లేవు
జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వైకాపా ప్రభుత్వం 2021లో హడావిడి చేసింది. ఆ తరువాత క్లాప్ మిత్రల పేరిట పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించినా వారికి నెలనెలా సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదు. నెలకు రూ. ఆరు వేల చొప్పున ఒక్కో కార్మికునికి 15వ ఆర్థిక సంఘం నిధులతో అప్పుడప్పుడు జీతాలు ఇస్తున్నారు. నెలలు తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల క్లాప్ మిత్రలు విధులకు హాజరు కావడంలేదు.
సీఎం పర్యటనతో..
విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేయడానికి కొద్దినెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ చింతపల్లి వచ్చారు. ఆయన కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణానికి ఆనుకునే డంపింగ్ యార్డు ఉంది. అక్కడే ఘన సంపద కేంద్రం ఉంది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం అంతా ఉరుకులు పరుగులు పెట్టి డంపింగ్ యార్డు ప్రాంగణాన్నంతటినీ శుభ్రం చేయించారు. ఇందుకోసం వందల సంఖ్యలో కార్మికులను వినియోగించారు. ఆయన వెళ్లాక పరిస్థితి మళ్లీ షరా మామూలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
సముచిత స్థానం కల్పిస్తాం
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను పాడేరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేశ్నాయుడు మంగళవారం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
వైకాపా పాలనలో కానరాని అభివృద్ధి
[ 01-05-2024]
అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్షో నిర్వహించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
అరకు వైకాపాకు తిరుగు‘పోటు’
[ 01-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మండుతున్న ఎండలు... తాగునీటికి అవస్థలు
[ 01-05-2024]
వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జగన్ని ఇంటికి పంపిద్దాం
[ 01-05-2024]
కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ అన్నారు. -
వైకాపా పాలనలో మహిళలపై పెరిగిన అకృత్యాలు
[ 01-05-2024]
వైకాపా పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణా తెదేపా నాయకులు, స్టార్ కాంపెయినర్ నర్సిరెడ్డి తెలిపారు. -
ప్రజల ఆస్తులను దోచుకోవడానికే జగనన్న భూ యాజమాన్య చట్టం
[ 01-05-2024]
ప్రజల సొంత ఆస్తులను దోచుకోడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. -
కార్మికులపై జగన్ కాఠిన్యం
[ 01-05-2024]
వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు. -
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల జమ
[ 01-05-2024]
ఎన్నికల నియమావళికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్ నెలల్లో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత మంగళవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్