logo

జగన్‌ని ఇంటికి పంపిద్దాం

కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 01 May 2024 01:46 IST

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన కూటమి నాయకులతో కలిసి ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్‌ కాలనీ, కొక్కిరాపల్లి, అగ్రహారం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ముందుగా గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా సీఎం రమేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎలమంచిలి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కన్నబాబురాజు దోపిడీ చేశారని ఆరోపించారు. కంకర దందా చేసి రూ. కోట్లు సంపాదించారన్నారు. సీఎం రాజేశ్‌ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్‌ను గెలిపిస్తే పరిశ్రమలు తీసుకు వస్తారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్నారు. తెదేపా పట్టణశాఖ అధ్యక్షులు గొర్లె నానాజీ మాట్లాడారు. మహిళలు విజయ్‌కుమార్‌కు హారతులిచ్చి విజయ తిలకాలు దిద్దారు. తెదేపా నాయకులు మజ్జి రామకృష్ణ, రామకృష్ణ, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని