జగన్ని ఇంటికి పంపిద్దాం
కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ అన్నారు.
ఎలమంచిలి, న్యూస్టుడే: కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన కూటమి నాయకులతో కలిసి ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, కొక్కిరాపల్లి, అగ్రహారం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ముందుగా గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా సీఎం రమేశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎలమంచిలి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కన్నబాబురాజు దోపిడీ చేశారని ఆరోపించారు. కంకర దందా చేసి రూ. కోట్లు సంపాదించారన్నారు. సీఎం రాజేశ్ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ను గెలిపిస్తే పరిశ్రమలు తీసుకు వస్తారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్నారు. తెదేపా పట్టణశాఖ అధ్యక్షులు గొర్లె నానాజీ మాట్లాడారు. మహిళలు విజయ్కుమార్కు హారతులిచ్చి విజయ తిలకాలు దిద్దారు. తెదేపా నాయకులు మజ్జి రామకృష్ణ, రామకృష్ణ, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరకు పర్యటకానికి కొత్తరూపు
[ 21-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. -
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
చంద్రబాబు సీఎం కావడం ఖాయం
[ 21-05-2024]
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు
[ 21-05-2024]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
రంపచోడవరంలో ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత పేర్కొన్నారు. -
ఈవీఎంల భద్రతలో అప్రమత్తం
[ 21-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా, రిటర్నింగ్ అధికారులు వి.అభిషేక్, భావన తెలిపారు. -
ఐటీఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు
[ 21-05-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
[ 21-05-2024]
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులతోపాటు బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. -
తెలంగాణ ఈసెట్లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
[ 21-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఏడు కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
-
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
-
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ