స్పందించాల్సిన తరుణమిదే!
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి.
దరఖాస్తులకు 22తో గడువు పూర్తి
దివ్యాంగులు, వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసుకునే అవకాశం
కార్యాలయంలో 12 డి దరఖాస్తు ఇస్తున్న ఓటరు కుటుంబ సభ్యుడు
నక్కపల్లి, న్యూస్టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. ఈ కోవలోనే దివ్యాంగులు, వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చింది. మే 13న జరిగే ఎన్నిక కోసం ఇలాంటి వారంతా దరఖాస్తు చేసుకోడానికి గడువు ఈనెల 22తో ముగియనుంది.
గత సార్వత్రిక ఎన్నికల వరకు ఎన్నికల దివ్యాంగులు, వృద్ధులు నేరుగా పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి. కొన్ని పార్టీల మద్దతుదారులు ఇలాంటి వారిని తామే స్వయంగా కేంద్రాలకు తీసుకువచ్చి ఓటేయిస్తుండటంతో ఇందులో పారదర్శకత లోపిస్తోంది. దీనికి తోడు ఇళ్ల నుంచి రాలేనివారు ఓటు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో ఇళ్లకే పరిమితమైనవారు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం ఫారం 12డిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీరి సేకరించిన ఎన్నికల సంఘం ఆ మేరకు బూత్స్థాయి అధికారుల ద్వారా వారికి 12డి ఫారాలు అందించేలా చొరవచూపింది. ఆసక్తి ఉన్నవారంతా దరఖాస్తులు నింపారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇళ్లకే పరిమితమైన వారిని బీఎల్వోలు గుర్తించి దరఖాస్తులు అందిస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగ ఓటర్లు 25 వేలకుపైగా ఉండగా, 85 ఏళ్లు దాటిన వృద్ధులు సుమారు 8 వేల మంది ఉంటారని అంచనా. ఇళ్ల వద్ద అనారోగ్య సమస్యలతో మంచాలకు పరిమితమైనవారు వందల సంఖ్యలో ఉంటారని అంచనా. కాగా ఇంటి వద్ద ఓటేయడానికి అనుమతి పొందిన వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయడం కుదరదు. ఓటు పొందినవారికి పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. ఆ మేరకు సెక్టోరల్ అధికారి పోలింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. బూత్స్థాయి అధికారి, పోలీసు అధికారి పర్యవేక్షణ, ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇలాంటి వారు రహస్యంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. హోం ఓటింగ్ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు.
రెండు విడతల్లో..
12డి దరఖాస్తు ఇవ్వడానికి ఈనెల 22తో గడువు ముగియనుంది. వీరికి 24వ తేదీ తర్వాత ఓటు వచ్చిన విషయాన్ని బీఎల్వోల ద్వారా తెలియజేస్తాం. ఈ మేరకు వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తేదీలోగా రెండు విడతల్లో పోలింగ్ చేయిస్తాం. మొదటి విడతలో వినియోగించుకోనివారు, రెండో విడతలో ఓటేయొచ్చు. అర్హులు ఎవరైనా పోస్ల్టల్ బ్యాలెట్ కోరుకుంటే 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇక కేంద్రాలకు వచ్చి ఓటేసే దివ్యాంగులకు కేంద్రాల వద్ద ర్యాంపులు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి.
కె.గీతాంజలి, ఆర్ఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
సముచిత స్థానం కల్పిస్తాం
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను పాడేరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేశ్నాయుడు మంగళవారం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
వైకాపా పాలనలో కానరాని అభివృద్ధి
[ 01-05-2024]
అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్షో నిర్వహించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
అరకు వైకాపాకు తిరుగు‘పోటు’
[ 01-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మండుతున్న ఎండలు... తాగునీటికి అవస్థలు
[ 01-05-2024]
వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జగన్ని ఇంటికి పంపిద్దాం
[ 01-05-2024]
కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించి, అవినీతి ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిద్దామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ అన్నారు. -
వైకాపా పాలనలో మహిళలపై పెరిగిన అకృత్యాలు
[ 01-05-2024]
వైకాపా పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయి భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణా తెదేపా నాయకులు, స్టార్ కాంపెయినర్ నర్సిరెడ్డి తెలిపారు. -
ప్రజల ఆస్తులను దోచుకోవడానికే జగనన్న భూ యాజమాన్య చట్టం
[ 01-05-2024]
ప్రజల సొంత ఆస్తులను దోచుకోడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. -
కార్మికులపై జగన్ కాఠిన్యం
[ 01-05-2024]
వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు. -
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల జమ
[ 01-05-2024]
ఎన్నికల నియమావళికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్ నెలల్లో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత మంగళవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్