విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది.
జగన్ జమానాలో అన్నదాతలపై విపరీతమైన భారం
సోనామసూరి బస్తాపై గరిష్ఠంగా రూ. 233 వడ్డింపు
ఈనాడు అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. జగన్ బాదుడే బాదుడులో ఏ వర్గాన్ని విడిచిపెట్టలేదు. విద్యుత్తు ఛార్జీల నుంచి విత్తనాల ధరల వరకు పెంచేశారు. మాట్లాడితే రైతు పక్షపాతినని చెప్పుకొనే సీఎం సాగుకు సాయం అందించకపోగా, రాయితీలకు కోతలు పెట్టారు. విత్తు ధరలు పెంచి అన్నదాతలను అప్పుల్లోకి నెట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయకుండా భరోసా కేంద్రాల చుట్టూ తిప్పారు. గతంలో రాయితీ విత్తనాలు సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ గోదాముల్లో దొరికేవి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో విత్తు కోసం యాప్లో నమోదు చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించి.. వారం నిరీక్షిస్తేగానీ అందడం లేదు. కోరిన విత్తనాలను అందుబాటులో పెట్టకుండా.. ఈ-పంట పేరుతో ఒకటి, రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకుండా అన్నదాతలను అవస్థలకు గురి చేస్తున్నారు.
కాడి వదిలేస్తున్న రైతు
రైతులకు ఏటా రాయితీ అందించే వరి విత్తనాల ధరలు భారీగా పెంచేశారు. గతంతో పోల్చితే రకాన్ని బట్టి క్వింటాకు రూ. 550 నుంచి రూ. 760 వరకు పెరగడంతో సన్న, చిన్నకారు రైతులపై ఆ మేరకు అదనపు భారం పడింది. ఓవైపు ఇంధన ధరలు, ఎరువుల రేట్లు పెరిగిపోయాయి. ఇంకోవైపు కూలీల వేతనాలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విత్తనాల రేట్లు కూడా పెంచడంతో చాలామంది కర్షకులు కాడిని వదిలేశారు. కొందరు కౌలుకు ఇచ్చి సాగుకు దూరంగా ఉన్నారు. కౌలు తీసుకోవడానికి రానిచోట బీడు భూములుగా వదిలేశారు. దీంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.
రూ. కోట్లలో భారం
ఉమ్మడి జిల్లాలో 1.02 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటారు. మొత్తం సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తనాలను ప్రభుత్వం ఎప్పుడూ సరఫరా చేయదు. కేవలం 30 నుంచి 35 శాతం విస్తీర్ణానికే రాయితీ విత్తనాలను అందుబాటులో ఉంచింది. మిగతా వారంతా ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సిందే. ఉమ్మడి జిల్లాలో రైతాంగానికి 55 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. తెదేపా హయాంలో క్వింటా వరి విత్తనాలు రాయితీ పోను రూ.2,320 నుంచి రూ.2,390 వరకు ఉండేది. వైకాపా సర్కారు వచ్చాక అవే విత్తనాలు రూ. 2,850 నుంచి రూ. 2,960 వరకు పెరిగాయి. క్వింటాకు సగటున రూ. 570 పెరిగింది. ఈ లెక్కన రాయితీ విత్తుపై రూ.3.69 కోట్లకు అదనంగా రైతులు ఖర్చుచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం శాఖాపరంగా సరఫరా చేసిన విత్తనాలపై భారం మాత్రమే.
పచ్చిరొట్టపైనా బాదుడే!
వరి సాగుకు ముందు తొలకరి వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటారు. జిల్లాలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలు వేస్తారు. 2020లో జీలుగ పది కేజీలు రూ. 639 ధర ఉంటే దీన్ని రూ. 790కి పెంచారు. పిల్లిపెసర పది కేజీలు రూ. 877 ఉంటే ఈసారి రూ. 970కి పెంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు