పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు విశేష స్పందన
తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
తలార్సింగిలో ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ సునీత, చిత్రంలో సబ్ కలెక్టర్, అదనపు ఎస్పీ
పాడేరు, న్యూస్టుడే: తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అంతకు ముందు స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను సందర్శించారు.
జిల్లాలో సోమవారం 3073 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. 15 మంది హౌస్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు.
అరకులోయ, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు విశేష స్పందన లభించింది. అరకులోయ నియోజకవర్గానికి సంబంధించి కంఠబంసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం 842 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి అభిషేక్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 753 మంది, పాడేరు నియోజకవర్గానికి సంబంధించి 30 మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 59 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఈనెల 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి అభిషేక్ తెలిపారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అరకులోయలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు
అరకొర ఏర్పాట్లు.. ఉద్యోగులకు ఇక్కట్లు
పాడేరులో చెట్ల కింద ఉన్న ఉపాధ్యాయులు
పాడేరు, న్యూస్టుడే: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఓటర్లకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో ఉద్యోగులకు ఆపసోపాలు తప్పలేదు. తలార్సింగి ఆశ్రమ పాఠశాలలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రంలో నీడ సదుపాయం కూడా లేక ఉద్యోగులు సమీపంలోని చెట్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ల్లో పూర్తిస్థాయి ఎన్నికల పరికరాలు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలీచాలని గమ్ముతో పోస్టల్ బ్యాలెట్ పేపరు కవరును అంటించారు. గెజిటేడ్ అధికారికి కావాల్సిన పెన్నులు, ఇతర వస్తువులు కూడా అందించలేదని ఒక అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం