పోలవరం నిర్వాసితులను మోసంచేసిన వైకాపా
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు.
అరకు ఎంపీ అభ్యర్థిని గీత
పెదభీంపల్లి ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీ-1 వద్ద నిర్వాసితుల సమస్యలు వింటున్న ఎంపీ అభ్యర్థి గీత
దేవీపట్నం, గంగవరం, న్యూస్టుడే: కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్, గంగవరం మండలం మొల్లేరు పంచాయతీల్లో ఆమె మంగళవారం పర్యటించారు. రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు వైకాపా ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.పది లక్షలు ఇస్తామని మోసం చేసిందన్నారు. గిరిజనులు, గిరిజనేతరులను మోసం చేసిన ఒక సైకో రంపచోడవరంలో ఉన్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి గెలుపుతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారమవుతాయన్నారు. పెదభీంపల్లి పునరావాస కాలనీ-1లో ముంపు గ్రామాలైన డి.రావిలంక, పరగసానిపాడు, బోడిగూడెం నిర్వాసితులు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గీత ఎదుట మొరపెట్టుకున్నారు. ఇందుకూరు-1 ఆర్అండ్ఆర్ కాలనీలో ఆమె పర్యటించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంగవరం మండల తెదేపా, జనసేన అధ్యక్షులు పాము అర్జున్, కుంజం సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
తెదేపాలో చేరికలు
రాజేశ్వరి, శిరీషాదేవి సమక్షంలో తెదేపాలోకి చేరుతున్న నిమ్మలగూడెం గ్రామస్థులు
చింతూరు: మండలంలోని నిమ్మలగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో సుమారు 242 కుటుంబాలు తెదేపాలోకి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, తెదేపా నేతలు ఇల్లా చిన్నారెడ్డి, జమాల్ఖాన్, సోడె శ్రీనివావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్