logo

`ముక్కంటికి ఆభరణాల బహూకరణ

ఉప్పలూరులో వేంచేసి ఉన్న శ్రీభోగమల్లేశ్వరస్వామిలో స్వామి, అమ్మవార్లకు గ్రామానికి చెందిన అట్లూరి వెంకటమధుకిషన్‌, పద్మవల్లి దంపతులు రూ.2.4 లక్షల విలువైన

Published : 19 May 2022 03:14 IST

ఈవో, అర్చకునికి ఆభరణాలు అందజేస్తున్న దాతలు వెంకటమధుకిషన్‌, పద్మవల్లి

ఉప్పలూరు(కంకిపాడు), న్యూస్‌టుడే: ఉప్పలూరులో వేంచేసి ఉన్న శ్రీభోగమల్లేశ్వరస్వామిలో స్వామి, అమ్మవార్లకు గ్రామానికి చెందిన అట్లూరి వెంకటమధుకిషన్‌, పద్మవల్లి దంపతులు రూ.2.4 లక్షల విలువైన ఆభరణాలను బుధవారం ఈవో, అర్చకునికి అందజేశారు. వీటిలో వెండి నామం, భద్రకాళి అమ్మవారికి కిరీటం, హస్తాలు, పాదాలు, మకరతోరణం ఉన్నాయి. ఈ సందర్భంగా దాతల పేరుతో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. స్థానిక ప్రతినిధులు కొణతం సుబ్రహ్మణ్యం, చలసాని రాధాకృష్ణమూర్తి, అన్నే సాంబశివరావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు