‘బుసక’ మాయం
ప్రభుత్వ పరమైన నిర్మాణాలకు మండల స్థాయి అధికారుల అనుమతితో సమీప ప్రాంతాల నుంచి బుసక రవాణా తీసుకున్న అనుమతుల మాటున రోజూ పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతోంది. అక్రమ రవాణా కారణంగా తలెత్తే ఇబ్బందులను భరించలేని స్థానికులు కృత్తివెన్ను, పెడన...
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
ప్రభుత్వ పరమైన నిర్మాణాలకు మండల స్థాయి అధికారుల అనుమతితో సమీప ప్రాంతాల నుంచి బుసక రవాణా తీసుకున్న అనుమతుల మాటున రోజూ పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతోంది. అక్రమ రవాణా కారణంగా తలెత్తే ఇబ్బందులను భరించలేని స్థానికులు కృత్తివెన్ను, పెడన, మచిలీపట్నం, నడకుదురు, అవనిగడ్డ తదితర ఇసుక రవాణా చేసే వాహనాలను అడ్డగించడం, కొన్ని వాహనాలకు అధికారులు జరిమానా విధించడం వంటి ఉదంతాలున్నాయి. మచిలీపట్నం, పెడన పరిధిలో వాహనాలను అడ్డగించిన రెవెన్యూ సిబ్బందిపై దాడులకు సైతం వెనకాడని పరిస్థితిపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలూ లేకపోలేదు. బందరు నియోజకవర్గ పరిధిలో మట్టి, బుసక రవాణా మొత్తం ముగ్గురు, నలుగురు వ్యక్తుల కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నారు. సీఆర్జెడ్ పరిధితో పాటు దీర్ఘకాలంగా తీరప్రాంతానికి రక్షణగా ఉండే ఇసుక దిబ్బలను మటుమాయం చేసేశారు.
మైనింగ్ శాఖ పరిధిలోకి వచ్చే ఇసుక, మట్టి, బుసక తదితరాలను అధికారుల అనుమతి పర్యవేక్షణ లేకుండా తవ్వకాలు చేపట్టరాదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. నదీతీర ప్రాంతం, సీఆర్జెడ్ పరిధిలో తవ్వకాలు పూర్తిగా నిషిద్ధం.అయినా కొన్ని నెలలుగా సీఆర్జెడ్ పరిధిలోకి వచ్చే మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాలతో పాటు పెడన, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, తదితర మండలాల్లో లక్షలాది క్యూసెక్కుల బుసక తరలిపోయింది. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నదీ తీరప్రాంతంలో స్థానికులు కలవరపడేలా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో కీలక నాయకునిగా చలామణి అవుతున్న ఓ నాయకుని పర్యవేక్షణలో నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి మాఫియా చెలరేగిపోతుందన్న ఆరోపణలున్నాయి.చల్లపల్లి మండల పరిధిలోని ఏనుగులదిబ్బతో పాటు మచిలీపట్నం వెస్ట్, పోలాటితిప్ప, తపసిపూడి, కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లోని ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా ఉండాల్సిన మెరకదిబ్బలను ఆనవాళ్లే లేకుండా చేసేశారు. కృతివెన్ను మండల పరిధిలోని సీఆర్జెడ్ భూముల్లో మట్టి తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు.
బుట్టదాఖలైన ఫిర్యాదులు
పెడన నియోజకవర్గ పరిధిలో కాల్వగట్టులతో పాటు గూడూరు మండలంలో జనావాసాల మధ్య, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలపై స్థానికులు చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలే అయ్యాయి. పెడన పైడమ్మ, పల్లోటి 1, 2 లేఔట్లకు సంబంధించి రూ.6 కోట్ల అంచానా వ్యయంతో చేపట్టిన పనుల్లో అవినీతితో పాటు మట్టి అక్రమ రవాణా చేశారన్న అభియోగాలున్నాయి. మెరక అవసరాలకు తగిన విధంగా మట్టి లభ్యత తగ్గిపోతుండంతో తాజాగా అక్రమార్కులు దృష్టి అసైన్డ్భూములపై పడింది. పట్టాదారులను చెరువుల లీజు పేరున తమదైన శైలిలో ఒప్పించి కొంత మట్టిని తరలించేస్తున్నారు. అధికారుల పర్యటనలకు సంబంధించిన సమాచారం ముందే తెలిసే ఏర్పాట్లు చేసుకుని వారు వచ్చే రోజు పనులు నిలిపివేస్తున్నారు. ఎవరైనా సొంత భూముల్లో మట్టిని తరలించుకోవాలన్నా అనుమతులు ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆర్జన కల్పిస్తున్న మట్టి, బుసక అక్రమ వ్యాపారం బహిరంగ రహస్యమే అయినా నామమాత్రపు కేసులు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా మట్టి మాఫియా దోపిడిని అరికట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అధికారులు ఏమంటున్నారంటే..
ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే అభివృద్ధి పనులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా బుసక తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు