గన్నవరం పంచాయతీ ఈవో సస్పెన్షన్
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గన్నవరం పంచాయతీ ఈవో రాజేంద్రవరప్రసాద్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీ నాగేశ్వరనాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గన్నవరం పంచాయతీ ఈవో రాజేంద్రవరప్రసాద్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీ నాగేశ్వరనాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.4 కోట్ల ఆదాయం కలిగిన పంచాయతీలో ఈవో, సర్పంచి నిడమర్తి సౌజన్యలు సుమారు రూ.2 కోట్ల మేర నిధులను పక్కదారి పట్టించి స్వాహా చేశారని అక్టోబర్ 10న స్పందనలో జిల్లా కలెక్టర్కు పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ డీఎల్పీవో సంపత్కుమారి, సీనియర్ అసిస్టెంట్ శివరామకృష్ణ సహా మరో ఐదుగురితో కలెక్టర్ రంజిత్బాషా విచారణకు ఆదేశించారు. సుమారు పది రోజుల పాటు విచారణ చేపట్టిన డీఎల్పీవో బృందం.. ఈవో, సర్పంచి ఇద్దరూ రూ.1,58,12,672 నిధులను దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. విచారణ కమిటీ నుంచి నివేదిక అందుకున్న డీపీవో.. తదుపరి చర్యల నిమిత్తం వివరణ కోరుతూ ఈ నెల 10న ఈవో, సర్పంచిలకు షోకాజ్ నోటీసులిచ్చారు. దుర్వినియోగానికి పాల్పడిన నగదును 1:1 నిష్పత్తిలో రూ.79.06 లక్షల చొప్పున ఇరువురిని బాధ్యులను చేస్తూ.. సర్పంచి చెక్పవర్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు. ఈవో నుంచి వివరణ అందుకున్న అనంతరం అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ను సోమవారం స్పందనలో కలిసిన పాలకవర్గ సభ్యులు వీలైనంత త్వరలో రూ.1.58 కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడమని తేల్చి చెప్పారు.
ప్రతి బిల్లు రూ.లక్షపైనే..: పంచాయతీ నిధుల దుర్వినియోగ వ్యవహారంలో ప్రతి బిల్లు రూ.లక్షపైనే ఉన్నట్లు తెలిసింది. విచారణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అద్దె ట్రాక్టర్లను తిప్పడమే కాకుండా సుమారు రూ.25 లక్షల మేర చెల్లించడంపై డీఎల్పీవో సంపత్కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే అద్దె ట్రాక్టర్లను తొలగించాలని ఆదేశించినా నేటికీ కొనసాగించడం గమనార్హం. కలెక్టర్, డీపీవో స్థాయి అధికారులు అనుమతించాల్సిన బిల్లులకు సైతం నేరుగా నగదు చెల్లించారని సమాచారం. నకిలీ బిల్లులు పెట్టడంలో ఈవో, సర్పంచికి ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి బదిలీపై వెళ్లిన గుమస్తా రామారావు వీరికి సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. చెత్త తరలింపు, పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఈవో, సర్పంచిలు నకిలీ బిల్లులతో దోపిడీకి సంబంధించిన పూర్తి ఆధారాలను కలెక్టర్, విచారణ కమిటీకి ఫిర్యాదుదారులు అందజేయడంతోనే ఉచ్చుబిగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?