దేవాదాయశాఖ భూమిపై పాలకుల కన్ను
వైకాపా ప్రభుత్వం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.
అఖిల పక్ష సమావేశంలో నాయకుల ఆరోపణ
ఐక్యత చాటుతున్న అఖిలపక్ష నాయకులు
భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.290 కోట్ల విలువ చేసే దేవాదాయశాఖ ఆస్తిని మన కళ్ళ ముందే దోచేసే కుట్ర జరుగుతుందన్నారు. తొలుత 2 ఎకరాలు వైకాపా పార్టీకి అని చెప్పినా మొత్తం 5.45 ఎకరాలపై పాలకులు కన్నేశారని ఆరోపించారు. 1942లో చల్లపల్లి రాజా వారు ఈడేపల్లిలోని జోడుగుళ్ళకు ఆ భూమిని దానం చేశారన్నారు. తాజాగా పాలకులు సర్వేయర్పై ఒత్తిడి తెచ్చి పీడబ్ల్యూడీ భూమిగా మార్పు చేశారని, ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే పేర్ని నాని కనుసన్నల్లోనే జరిగిందన్నారు. బందరులో ఆక్రమణల పర్వం కొనసాగుతోందని, చలరస్తాలో సత్రం, సోడా, బీడీ వర్తకసంఘం భవనం, నోబుల్ చర్చి పక్కన స్థలం ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. కమిషనర్కు ఫిర్యాదు చేస్తే కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ఈ ఆక్రమణలపై సోమవారం స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు అందజేయాలని నిర్ణయించారు. మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, తాకట్టు పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. భాజపా నాయకుడు కూనపరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్రమణకు గురవుతున్న భూమిని కాపాడుకునేందుకు తొలుత కాకినాడలోని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్ మాట్లాడుతూ భూమిని కాపాడటానికి ఎటువంటి ఉద్యమం చేపట్టినా మద్దతు ఇస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు భూమిని కాపాడేందుకు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు కె.సత్యనారాయణ, సీపీఐ నాయకుడు గగన్, జనసేన నాయకుడు గడ్డం రాజు, కార్పొరేటర్లు నాగరాము, అనిత, బ్రాహ్మణ సంఘ నాయకుడు పి.వి.ఫణికుమార్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెపాటి గోపీచంద్,నాయకులు ఎం. బాబాప్రసాద్, మురళీకృష్ణ, నాని, సోమశేఖర్, నారాయణప్రసాద్, ఇలియాస్ పాషా, భాజపా నాయకుడు గంటా సతీష్, న్యాయవాది లంకె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొల్లు రవీంద్రకు నోటీస్ అందజేత: మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. బుధవారం అఖిలపక్ష సమావేశంలో ఉన్న ఆయనకు చిలకలపూడి ఎస్ఐ కిషోర్ 41ఎ నోటీస్ అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?