మురిసేలోగా.. ముసిరిన చీకట్లు
దాదాపు రెండు సంవత్సరాలుగా బదిలీల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
బదిలీలపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్టుడే: దాదాపు రెండు సంవత్సరాలుగా బదిలీల కోసం ఆశగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెప్పుకోవడానికి మినహా ఆచరణకు అక్కరక్కొచ్చేవి కావన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధరణ బదిలీలకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం వాటితో పాటు సచివాలయ ఉద్యోగులకు తొలుత అవకాశం కల్పించకపోయినా.. తదుపరి ఇచ్చిన జీవోలో మార్గదర్శకాల ప్రకారం అసలు బదిలీలకు అవకాశం ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాల భర్తీ కోసం 2019 రాత పరీక్ష ద్వారా తొలివిడత ఉద్యోగులను ఎంపిక చేశారు. తర్వాత రెండు విడతల ఎంపిక ద్వారా మిగిలిన ఖాళీలు భర్తీ చేశారు. సచివాలయాల్లో వివిధ కేడర్లలో పనిచేసే ఏ ఒక్కరికి ఐదేళ్ల సర్వీసు పూర్తవకపోవడంతో వీరికి సాధారణ బదిలీలు వర్తించే పరిస్థితి లేదు. తాము బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్లు గడుస్తున్నా తమ బదిలీల గురించి ఎందుకు పట్టించుకోరన్న సచివాలయ ఉద్యోగుల సంఘ డిమాండ్తో ప్రభుత్వం వారి బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నామమాత్రపు బదిలీలు కూడా అయ్యే అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత సూచించిన నిబంధనల మేరకు మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ కేసులు, ఒంటరి మహిళలు, పరస్పర అంగీకారం ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో సంఘ నాయకులు ఈ విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారితో పాటు ముందు సూచించిన నాలుగు కేటగిరీల అనంతరం ఇతరులకు అవకాశం కల్పిస్తున్నట్టు హామీ ఇచ్చారు.
పరస్పర అంగీకారం ఉంటేనే..
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపట్టాల్సి ఉంది. మొత్తం 508 సచివాలయాల పరిధిలో 4,500 మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో జిల్లా స్థాయిలో 20 శాతం, అంతర్ జిల్లాల పరిధిలో 15 శాతం బదిలీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయాల్లో ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో ఏ స్థాయి బదిలీ అయినా పరస్పర అంగీకారం ఉంటేనే కుదిరే అవకాశం ఉంది. ఎన్నికల ముందస్తుగా వస్తాయన్న ఊహాగానాలతో బదిలీకి అవసరమైన నోడ్యూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సంబంధిత శాఖాధిపతులు సుముఖంగా లేరు. పశ్చిమ కృష్ణాకు చెందిన పలువురు తూర్పు కృష్ణా పరిధిలో వ్యవసాయ అసిస్టెంట్లుగా ఉన్నారు. వారు పశ్చిమ కృష్ణాకు వెళ్లాలనుకుంటే అక్కడ ఉద్యాన వన అసిస్టెంట్లు ఉన్నారు. అవసరార్థం పరస్పర అంగీకారంతో రావాలనుకున్నా వీలుపడదు. జిల్లాలో అంతర్ జిల్లా బదిలీ కోరుకునే వారు దాదాపు ఎనిమిది శాతానికి పైగా ఉన్నారు. విభజిత జిల్లాలకు వెళ్లానుకునే వారు 40 శాతానికి పైగా ఉన్నారు. తప్పనిసరిగా బదిలీ కావాలని కోరుకునే వారిని వారి ప్రత్యామ్నాయంగా మరొకరు వచ్చేలా మ్యూచువల్ బదిలీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
రాజకీయ పైరవీలే ప్రధానం
జిల్లా వాప్తంగా అధికశాతం సచివాలయాల్లో ఉద్యోగులపై కొందరు అధికార పార్టీ నాయకులు, సర్పంచులే పెత్తనం చలాయిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి వారు చెప్పింది చేయకపోతే వారు సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎక్కువగా వేధింపులకు గురవుతున్న వారు మరో సచివాలయానికి వెళ్లాలనే ప్రయత్నం చేసుకుంటున్నారు. బదిలీలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి ఉన్నా ఉద్యోగులు తాము కోరుకునే సచివాలయాన్ని ఎంచుకునే అవకాశం లేదు. కేవలం మండలాన్ని మాత్రమే సూచిస్తే అక్కడి ఎంపీడీవో నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా సచివాలయాన్ని కేటాయిస్తారు. ఇక్కడే రాజకీయ పైరవీలు ప్రభావం చూపుతాయి. గ్రేడ్-5 కార్యదర్శుల విషయానికొస్తే పంచాయతీల్లో గ్రేడ్-4 ఖాళీలు ఎన్నో ఉన్నా అర్హతలను బట్టి తమకు అవకాశం కల్పించలేదని, కనీసం డీడీవో అధికారం కల్పించకుండా ఉత్సవ విగ్రహాల్లానే కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సచివాలయం ఉన్న పంచాయతీకి బదిలీ చేయించుకుంటే అవకాశాన్ని బట్టి డీడీవో అధికారం దక్కవచ్చన్న ఆశతో కొందరు పావులు కదుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?