టోల్ బాదుడు
జాతీయ రహదారి - 216పైకి రావాలంటేనే కార్ల యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆర్టీసీ ప్రయాణికులు హడలిపోతున్నారు. టోల్ ప్లాజాలు వాహనదారుల తోలు తీస్తున్నాయి.
కిలోమీటరు పరిధిలో రెండు చోట్ల వసూళ్లు
హడలిపోతున్న వాహనదారులు, ప్రయాణికులు
న్యూస్టుడే, అవనిగడ్డ గ్రామీణం, మోపిదేవి
జాతీయ రహదారి - 216పై మోపిదేవి గురుకులం వద్ద కొత్తగా ప్రారంభించిన టోల్ప్లాజా
జాతీయ రహదారి - 216పైకి రావాలంటేనే కార్ల యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆర్టీసీ ప్రయాణికులు హడలిపోతున్నారు. టోల్ ప్లాజాలు వాహనదారుల తోలు తీస్తున్నాయి. ఒక కిలోమీటరు పరిధిలో రెండు టోల్ప్లాజాలు వాహనదారుల ముక్కుపిండి పన్ను వసూలు చేస్తుండడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మోపిదేవి వార్పు గురుకులం వద్ద ఏర్పాటు చేసిన టోల్ప్లాజా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
- పులిగడ్డ - పెనుమూడి వారధి సమీపంలో అవనిగడ్డ మండలం పులిగడ్డలో గతంలోనే టోల్ప్లాజా ఉంది. అక్కడి నుంచి ఒక కిలోమీటరు పరిధిలోనే రెండోది ఏర్పాటు చేయడంతో తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
- జాతీయ రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండగానే టోల్ వసూలు ప్రాంభించారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులిగడ్డలోని హైలెవెల్ వారధికి రెండు వైపులా ఉన్న రహదారి నరకప్రాయంగా మారింది. పులిగడ్డ- పెనుమూడి వారధి టోల్ప్లాజా రహదారి దానికి తీసికట్టుగా ఉండడంతో టైర్లు పగిలిపోతున్నాయని.. అయినా టోల్ కట్టించుకుంటున్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
- 60 కిలోమీటర్ల పరిధిలో టోల్ప్లాజా ఏర్పాటు నిబంధన ఉన్నా జాతీయ రహదారుల అధికారులు అందుకు భిన్నంగా కిలోమీటరు లోపే రెండు టోల్ప్లాజాలు ఏర్పాటు చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పులిగడ్డ- పెనుమూడి వారిధి వద్ద రోడ్డు దుస్థితి ఇలా..
ఆర్టీసీ కూడా బాదుతోంది
మోపిదేవివార్పు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ప్లాజా అమలులోకి రావడంతో అవనిగడ్డ ఆర్టీసీ డిపో కూడా టోల్ఛార్జీ పేరుతో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.10 అదనంగా ఛార్జీ వసూలు చేస్తోంది. మచిలీపట్నం, గుడివాడ రూట్లో ప్రయాణికుల ఛార్జీపై అదనంగా రూ.10 వసూలు చేస్తుండగా.. కరకట్ట, పామర్రు మీదుగా విజయవాడకైతే రూ.5 టోల్ ఛార్జిగా ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు.
అధిక పన్నులు వసూలు
మోపిదేవి వార్పు వద్ద ఏర్పాటు చేసిన టోల్ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వ్యాను, కారు, జీపు, తేలికపాటి మోటారు వాహనం ఒకసారి వెళ్లడానికి పులిగడ్డ టోల్ప్లాజా వద్ద రూ.25 వసూలు చేస్తుండగా కొత్త టోల్ప్లాజా వద్ద రూ.35 కట్టించుకుంటున్నారు. ఒక వాహనం ఒకరోజు వ్యవధిలో వెళ్లి వచ్చేందుకు పులిగడ్డ టోల్ప్లాజా వద్ద రూ. 37 తీసుకుంటుండగా మోపిదేవి వార్పు వద్ద రూ.55 వసూలు చేస్తున్నారు. వాహనాలను బట్టి రెండు టోల్ప్లాజాల వద్ద రెండు రకాల పన్నులు వసూలు చేయడం పట్ల వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి
- కె.ప్రసాద్, కారు డ్రైవర్, అవనిగడ్డ
మోపిదేవి వార్పు వద్ద ఏర్పాటు చేసిన టోల్ప్లాజాతో పన్నులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. అసలే డీజిల్, పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్నాయి. కిరాయిలు కిట్టడంలేదు. దానికి తోడు టోల్ పన్నులు వెంటాడుతున్నాయి. సంపాదన పెట్రోలు, కారు మరమ్మతులు, పన్నులు కట్టడానికే సరిపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? ఎలా బతకాలి?
టైర్లు పగిలిపోతున్నాయి
- ఎం.దుర్గారావు, కారు డ్రైవర్, అవనిగడ్డ
రహదారులపై గల గుంతల్లో పడి టైర్లు పగిలిపోతున్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతోపాటు టోల్ప్లాజా పన్నులతో ఎలా జీవనం చేయాలో తెలియడం లేదు. వాహనాలు తరచూ మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. పన్నుల వసూలులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ