కొట్టేదీ... కేసు కట్టేదీ.. వారే!
ఆమె దళిత మహిళ.. మాజీ శాసన సభ్యురాలు.. ఆమె ప్రసంగాలు మర్యాద, గౌరవవాచకాలతో.. సాధారణంగా ఉంటాయి. కానీ ఆమె దుష్ప్రవర్తన కలిగి ఉన్నారనీ, దూషించారనీ, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
తెదేపా శ్రేణులపై ఇష్టారీతిన కేసులు
ఖాకీ చాటున వైకాపా అరాచకీయం
ఈనాడు, అమరావతి
ఆమె దళిత మహిళ.. మాజీ శాసన సభ్యురాలు.. ఆమె ప్రసంగాలు మర్యాద, గౌరవవాచకాలతో.. సాధారణంగా ఉంటాయి. కానీ ఆమె దుష్ప్రవర్తన కలిగి ఉన్నారనీ, దూషించారనీ, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆమే... నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య. ఐపీసీ 504 (శాంతిభద్రతలకు విఘాతం), 505 (దూషించడం, దుష్ప్రవర్తన కలిగి ఉండటం), 353 ప్రభుత్వ ఉద్యోగిపై దాడి వంటి నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు. ఆమెపైనే కాదు.. ఇవే సెక్షన్లు మరో 30 మందిపై పెట్టారు. ఇంకా కొందరిని చేర్చే ఉద్దేశంలో ఉన్నారు.
ఇదే ఠాణా పరిధిలో ఇసుక మాఫియా తమపై దాడి చేసిందని సెబ్ అధికారులు ఫిర్యాదు చేస్తే.. బెయిలబుల్ కేసులు పెట్టారు. కానీ నేటికీ చర్యల్లేవ్. కారణం.. వారు వైకాపా నాయకులు. వత్సవాయి ఠాణాలో మూడు ఇసుక లారీలు పట్టుకుని తెదేపా వారు అప్పగిస్తే.. న్యాయసలహా పేరిట కేసు పెట్టకనే దాటవేశారు. కారణం.. వైకాపా నాయకులు. -- ఇవీ కంచికచర్ల ఠాణాలో నమోదైన కేసులు.
అధికార పార్టీకి ఓ లెక్క.. ప్రతిపక్షానికి మరోలెక్క.. అధికార పార్టీ నేతలు ఎందరిని బెదిరించినా.. దాడులు చేసినా కేసులుండవు. కానీ ప్రతిపక్ష నేతలు అడిగితేనే బెదిరించినట్లు, హత్యాయత్నం చేసినట్లు.. పోలీసు కేసులతో తెదేపా శ్రేణులను వైకాపా నాయకులు హడలెత్తిస్తున్నారు. ప్రజాస్వామ్యయుత నిరసనలపైనా ఉక్కుపాదం మోపి.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. అదే వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడినా.. అరాచకంతో బరి తెగించినా ఖాకీలకు కనిపించదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలాంటి ఉదంతాలు ఎన్నో. ఇసుక దందా నుంచి బూడిద రవాణా వరకు అంతే. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. పోలీసు యంత్రాంగం ఇంతలా పక్షపాతం చూపడంపై తెదేపా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
లోపల వేయండి.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి గడప గడపకు మన ప్రభుత్వం పేరిట తిరుగుతుండగా ఓ యువకుడు ఉద్యోగాలు, అవినీతిపై ప్రశ్నించాడు. అంతే అతడిని అరెస్టు చేయాలని అక్కడ పోలీసులను ఆదేశించారు. ఆ వ్యాఖ్యలు చాలా దురుసుగా.. అసభ్యంగా పోలీసులు తన బానిసలు అన్నట్లు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంతే జీ హుజూరు అని పోలీసులు అడిని ఈడ్చేశారు. ఇదేం పద్ధతని అందరూ ఆశ్చర్యపోయారు.
- మంత్రి జోగి రమేష్ అనుచరులమని కొందరు యువకులు గుంటూరు జిల్లా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రయాణీకుల బస్సులకు అడ్డం తిరిగి వారి బంధువుల ముందే దూషించారు. వీరు ఎమ్మెల్యే స్టిక్కర్లున్న కార్లలో వచ్చారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా.. పోలీసులు మాత్రం మంత్రి చెప్పారని కేసు కట్టలేదు.
- పెడన పాఠశాలలో విద్యార్థులు తరగతులు బహిష్కరిస్తే.. తెదేపా నాయకులపై ట్రెస్పాస్ (అక్రమ ప్రవేశం) పేరుతో ఆరుగురిపై కేసులు పెట్టారు. కారణం.. మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే జోగి రమేష్... మాజీ సీఎం ఇంటిపై దాడి చేయడానికి ఆయుధాలతో వెళితే కేసులే లేవు. కలిసేందుకు వెళ్లారని కొత్త భాష్యం చెప్పారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాఠశాలలలో అక్రమంగా ప్రవేశించి విద్యార్థులు తరగతుల నుంచి బయటకు తెచ్చిన సందర్భాలు కోకొల్లలు.
రాజకీయ కేసులు ఎన్నో..!
చంద్రబాబు అరెస్టు సందర్భంగా చేసిన నిరసనలకు అందరిపైనా కేసులు నమోదు చేశారు. అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దూషణల కింద నాన్బెయిల్బుల్ కేసులు, పోలీసు ఆంక్షల ఉల్లంఘన పేరిట బెయిల్బుల్ కేసులకు లెక్కే లేదు. ఇప్పటికే పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను ఓ హత్య కేసుతో సంబంధం ఉందనీ, మాజీ మంత్రి దేవినేని ఉమాను కొండపల్లి తవ్వకాల ఆందోళనలో అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా కేసులు పెడతామని.. నాయకులను హెచ్చరిస్తున్నారు.
- గుడివాడలో వెనిగండ్ల రాము, మరో 30 మందిపై పోలీసు యాక్ట్ ఉల్లంఘించారని కేసులు పెట్టారు. నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి సమాచారం ఇవ్వకుండా వదిలేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత రాజకీయ కారణాలతో తెరమీదకు తెస్తున్నారు. రావి వెంకటేశ్వరరావు, మరికొందరు టిడ్కో ఇళ్లను పరిశీలిస్తే.. కేసులెట్టారు. ఓ మాజీ ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలపై స్పందించే పరిస్థితి లేదని ఆయన వాపోతున్నారు.
- మైలవరంలో తెలుగు యువత నాయకులపై కేసులు పెట్టారు. మాట్లాడితే కేసులే పెడుతున్నారు.ఔ
- విజయవాడలో బంద్ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘరామకృష్ణంరాజు పై ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాలు ధిక్కరించారని సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ప్రజామార్గంలో అవరోధం కింద 283, న్యూసెన్సు కింద 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- కృష్ణలంకలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరో 20 మందిపై సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. గద్దె అనురాధ, గొట్టిముక్కల, బాలస్వామి, పరుచూరి ప్రసాద్ తదితరులపై సెక్షన్ 151 కేసులు పెట్టారు. వన్ టౌన్లో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరో 20 మందిపై సోమవారం కేసులు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగులపాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
[ 17-05-2024]
నాగులపాడులో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. -
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!