Andhra news: అనుమానం పెనుభూతమై.. భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య
చక్కని కాపురంలో ఏడాది క్రితం అనుమానపు భూతం ప్రవేశించింది. చివరికి అది తీవ్రరూపం దాల్చి ఓ చిన్నారిని అనాథను చేసింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను 12 సార్లు కత్తితో పొడిచి చంపిన తర్వాత అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుడివాడలో ఆదివారం సంచలనం కలిగించింది.
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: చక్కని కాపురంలో ఏడాది క్రితం అనుమానపు భూతం ప్రవేశించింది. చివరికి అది తీవ్రరూపం దాల్చి ఓ చిన్నారిని అనాథను చేసింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను 12 సార్లు కత్తితో పొడిచి చంపిన తర్వాత అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుడివాడలో (Gudivada) ఆదివారం సంచలనం కలిగించింది. పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన విష్ణుమూర్తుల వెంకన్న రెండో కుమార్తె రామలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని అప్పన్నపేటకు చెందిన తాతపూడి సూర్యనారాయణతో 2017 మే 24న వివాహమైంది. వారికి నాలుగేళ్ల హేమాన్ష్ కుమార్ అనే బాబు ఉన్నాడు. గత ఏడాది నుంచి సూర్యనారాయణ(30) భార్యను అనుమానిస్తుండడంతో ప్రశాంతంగా సాగుతున్న వారి కాపురంలో చిచ్చు రేగింది. తరచూ భార్యను కొడుతుండడంతో ఆమె పుట్టింటికి రావడం, వారు పెద్దలతో సర్దిచెప్పి మళ్లీ కాపురానికి పంపిస్తున్నారు.
అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వేధింపులు తాళలేని రామలక్ష్మి(26) ఈ ఏడాది ఆగస్టులో ఏలూరు జిల్లా గణపవరం పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింటికి వచ్చేసింది. సూర్యనారాయణ వస్తే మాట్లాడి పంపుదామని రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆదివారం పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఎవరూ లేరని తెలుసుకొని భర్త సూర్యనారాయణ వచ్చాడు. ఆమె తండ్రి వెంకన్న మరుగుదొడ్డిలో ఉండగా సూర్యనారాయణ పదునైన కత్తితో రామలక్ష్మిపై దాడి చేసి విచక్షణారహితంగా 12 సార్లు పొడిచాడు. ఆమె ఆర్థనాదాలకు తండ్రి వెంకన్న వచ్చి తన కూతుర్ని చంపకంటూ కేకలు వేశాడు. దీంతో అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు.
అప్పటికే రామలక్ష్మి చంక కింద భాగంలో పొడవడం వల్ల ఆమె కుప్ప కూలిపోయింది. వెంటనే స్థానికుల 108 సాయంతో ఇద్దర్నీ గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో సూర్యనారాయణ కలుపు నివారణ మందు తాగేశాడు. అతడ్ని కూడా స్థానికులు 108 ఆంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందాడు. గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్, వన్టౌన్ సీఐ కె.ఇంద్రశ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద రామలక్ష్మి సోదరి పాండ్రంకి నాగదుర్గ, బంధువుల రోదనలు చూపరుల్ని కలచి వేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగులపాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
[ 17-05-2024]
నాగులపాడులో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. -
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా