TDP-Janasena-BJP: మిత్రపక్షాల్లో ... ఉత్కంఠ..!
ఉమ్మడి జిల్లాలో మిత్రపక్షాలకు చెందిన నాలుగు స్థానాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంటు స్థానాల విషయంలో స్పష్టత వచ్చినా.. శాసనసభ నియోజకవర్గాల విషయం కొలిక్కి రాలేదు.
స్వతంత్రంగా పోటీ చేస్తామంటున్న ఆశావాదులు
ఈనాడు అమరావతి: ఉమ్మడి జిల్లాలో మిత్రపక్షాలకు చెందిన నాలుగు స్థానాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంటు స్థానాల విషయంలో స్పష్టత వచ్చినా.. శాసనసభ నియోజకవర్గాల విషయం కొలిక్కి రాలేదు. నాలుగు స్థానాల్లో రెండు తెదేపా పోటీ చేసే విషయం తెలిసిందే. మిగిలిన రెండింటిలో ఒకటి జనసేనకు, మరో స్థానం భాజపాకు కేటాయించారు. వీటిపై స్పష్టత కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేస్తానని ఆశావాదులు ప్రకటనలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా జనసేన-భాజపా మధ్య ఈ సందిగ్ధం నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో రెండు లోక్సభ, 14 శాసనసభ స్థానాలకు.. ఇప్పటికే తెదేపా 10 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ మిత్రపక్షాలకు వదిలేసింది. మొదట రెండూ జనసేనకే అని భావించారు. కానీ భాజపాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి కేటాయించాల్సి వచ్చిందని స్వయంగా జనసేనాని పవన్ ప్రకటించడం విశేషం. తెదేపా పోటీ చేసే పెనమలూరు, మైలవరం అభ్యర్థుల ఖరారులోనూ ప్రతిష్టంభన నెలకొంది.
ఖరారుపై కసరత్తు..!
ఈ నాలుగింట మిత్రపక్షాలు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి. లోతుగా పరిశీలన చేస్తున్నారు. గెలుపు గుర్రాలపై అంచనాలు వేస్తున్నారు. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత దాదాపు అక్కడే పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చినట్లు తెదేపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమా బాధ్యుడిగా ఉన్న నియోజకవర్గం కావడంతో సర్దుబాటుపై చర్చ జరుగుతోంది. వసంత నియోజకవర్గ ముఖ్యనాయకులతో భేటీలు నిర్వహించి ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెనమలూరుకు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నానని అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారు. కానీ ఆయన బాబు ఫొటోతో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించి కలకలం లేపారు. మరోవైపు ఆయనకే ఖరారైందనే ప్రచారమూ జరుగుతోంది. అలాగే తెనాలికి చెందిన ఆలపాటి రాజాకు ఇస్తున్నారని చెబుతున్నారు. దేవినేని కుటుంబం నుంచి తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్కు పిలుపొచ్చిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ న్యాయ విభాగానికి చెందిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ క్యూలో ఉన్నారు. మరోవైపు తనపై దుష్ప్రచారం తగదనీ... తనకు వంశీకి, కొడాలి నానికి సంబంధం లేదని బోడే వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
జనసేనకు ధిక్కరింపు..!
ఇటీవల భేటీలో జనసేనాని పవన్... పొత్తు ధర్మం ప్రకారం విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయలేకపోతున్నామని ప్రకటించారు. అయినా.. తనకు ఇస్తే సరి లేకపోతే పవన్ ఫొటోతో పోటీ చేస్తానని తాజాగా పోతిన మహేష్ ప్రకటించడం కలకలం రేపింది. మరోవైపు ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయడంలో భాజపా జాప్యం చేస్తోంది. అవనిగడ్డలోనూ జనసేన అభ్యర్థి తేలలేదు. ప్రధాన పోటీదారుడు, వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాత్రం తన ప్రసంగంలో జనసేన నుంచి ఓ ఎన్ఆర్ఐ పోటీ చేయనున్నారనీ.. ఆయన వచ్చి ఖర్చు చేస్తారట అని ఓ సభలో ప్రకటించడం విశేషం. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట