logo

‘తుస్సుమన్న జగన్‌ బస్సు యాత్ర’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 29 Mar 2024 04:12 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

గొల్లపూడి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని.. డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టినా ఎవరూ రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన గురువారం గొల్లపూడిలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సొంత జిల్లాలోనే జగన్‌ను ప్రజలు తిరస్కరించారని, ఇడుపులపాయ నుంచి మొదలైన బస్సు యాత్ర విఫలమైందన్నారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రజలు నరకాసుర పాలనకు అంతం పలకాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆత్మసాక్షితో ఓటు వేయాలని, జనం రక్తాన్ని పీల్చే జగన్‌ సర్కార్‌ను ఇంటికి పంపాలన్నారు. ముఖ్యమంత్రి సాగునీటి రంగాన్ని నాశనం చేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బాబాయిని ఎవరు చంపారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గత అయిదేళ్లలో పడిన బాదలను ప్రజలు మరువలేరని అన్నారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని