logo

రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్‌ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు.

Published : 30 Apr 2024 06:24 IST

మాట్లాడుతున్న కేశినేని శివనాథ్‌, వేదిక పై గద్దె రామ్మోహన్‌, రాజా

బెంజిసర్కిల్‌(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్‌ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సోమవారం బెంజి సర్కిల్‌ సమీపంలోని హాలులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి రాగానే లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ రాజధానిగా అమరావతి కొనసాగాలంటే రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు నాగుమోతు రాజా, కార్యదర్శి అల్లాడ వీర వెంకట సత్యనారాయణ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, కె.వి.రామారావు, బొప్పన భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని