అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు.
పడకేసిన పరిశోధనలు
చౌడుబారిన భూముల్లో చనిపోతున్న మొక్కలు
శాస్త్రవేత్తల మాటలు బేఖాతర్
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
నిరుపయోగంగా ఇలా..
శాస్త్రవేత్తలు ఏమన్నారు
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. దీనిపై ఆలోచించి అనువుగా ఉండే భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. పరిశోధనాస్థానానికి భూమి కేటాయించే సమయంలో లాంఫాం శాస్త్రవేత్తలు ఎమ్మెల్యే పేర్ని నానీకి చెప్పిన మాటలు ఇవి
పనికిరాని భూమి ఉంటుందా: పేర్ని నాని
ఏం చెబుతారండి పనికి రాని భూమి అంటూ ఉంటుందా...ఏదైనా భవనం నిర్మించి ఖాళీగా వదిలేస్తే ఏమవుతుంది. గబ్బిలాలు పడతాయి. అలాగే ఆ భూమి కూడా సాగు చేయడంలేదు కాబట్టి అలా ఉంది. గతంలో అక్కడ పంటలు పండించేవారు. ఏవైనా వసతులు కావాలంటే సమకూరుద్దాం.. ఎమ్మెల్యే పేర్ని శాస్త్రవేత్తలకు వ్యగ్యంగా ఇచ్చిన సమాధానం.
ఇది జరిగిన రెండేళ్లకు శాస్త్రవేత్తలు కలెక్టరేట్లో నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశంలో ఎమ్మెల్యే పేర్నిని కలిసి సాగుచేసిన పంట అంతా పాడైపోతోంది. వ్యవసాయ పరిశోధనా స్థానానికి ప్రత్యేకంగా పైపులైన్ ఏర్పాటు చేసి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యుత్తుతో పాటు వివిధ వసతులు కల్పించాలని కోరారు. దానికి ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ తాను రాజకీయాలనుంచి రిటైర్ అవుతున్నాననీ మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఇలా ఎమ్మెల్యే పేర్ని నాని ఎప్పటికప్పుడు ఏదో ఒక సమాధానాలు చెప్పి మభ్యపెట్టడం తప్ప ఇంతవరకు వ్యవసాయ పరిశోధన స్థానం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత భూములు చౌడుతేలి అధ్వానంగా మారిపోవడంతో అసలు పరిశోధనలు సాగుతాయా లేదా అన్న అనుమానాలు రైతులనుంచి వ్యక్తమవుతున్నాయి.
ఎండిపోతున్న పంటలు
పరిశోధనాస్థానం స్థలాన్ని వైద్య కళాశాలకు కేటాయించి కృష్ణా విశ్వవిద్యాలయం సమీపంలోని 17 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం కోసం కేటాయించారు. ఆ స్థలం సాగుకు అనువుగా సిద్ధం కావాలంటే కొన్నేళ్లు పడుతుందని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ముందునుంచీ చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తే వారు అన్నది స్పష్టమైందని రైతులు అంటున్నారు. అక్కడ పరిశోధనలు ప్రారంభించాలని 5 ఎకరాల్లో వివిధ రకాల విత్తనాలు సాగు చేశారు. నాట్లు వేసిన కొన్ని రోజులకే మొక్కలన్నీ చనిపోయాయి. అలా రెండేళ్లు ఒక మొక్క కూడా బతికిన దాఖలాలు లేవు. పొలాన్ని సాగుకు సిద్ధం చేయడంతోపాటు వివిధ రకాల పనులు చేయించి విత్తనాలు చల్లించడంతోపాటు ఇతర అవసరాల నిమిత్తం ఏటా రూ.2లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
కౌలు భూముల్లో పరిశోధన
ఒక విత్తనం వివిధ దశల్లో నిర్వహించే పరిశోధనలు పూర్తై రైతులకు అందుబాటులోకి రావాలంటే 12ఏళ్ల సమయం పడుతుందని, ఇలా ఏటా పంట దెబ్బతింటేే మరింత జాప్యం అవుతుందని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక వివిధ ప్రాంతాల్లో పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేయాల్సి వచ్చింది. వ్యవసాయ పరిశోధనస్థానం ఆధ్వర్యంలో .ఎంసీఎం-109, ఎంసీఎం-125 విత్తనాలు పరిశోధనలో ఉన్నాయి. ఎంసీఎం-103 విత్తనాన్ని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేయాల్సి ఉండడంతో తోట్లవల్లూరులో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని గత రబీలో సాగు చేశారు.
ఏటా వేలల్లో విత్తనాలపై పరిశోదనలు
ఏటా 2,500 నుంచి 3వేల రకాల వరకు విత్తనాలపై పరిశోధనలు జరుగుతుంటాయి. వ్యవసాయ పరిశోధనాస్థానం ఫిలిప్పిన్ పరిశోధనాస్థానంతో కూడా ఒప్పందం చేసుకోవడంతో వాళ్లు అందించేవి 400 రకాల వరకు ఉంటాయి వరుసగా రెండేళ్లపాటు సాగుచేసిన పంట చనిపోవడంతో విత్తన సైక్లింగ్ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
వసతులు లేవు... భవనం లేదు
పరిశోధన స్థానానికి కేటాయించిన భూమిని సాగుకు అనుగుణంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశోధన కేంద్రం ఉత్పత్తి చేసే విత్తనాలు 12శాతం వరకు ఉన్న చౌడును తట్టుకుంటాయి. ప్రస్తుతం ఆ భూమిలో 16 నుంచి 20శాతంవరకు చౌడు ఉండటంతో నాట్లు వేసిన మొక్కలన్నీ చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికోసం పంట కాల్వ నుంచి పరిశోధనాస్థానం వరకు ప్రత్యేక పైపులైన్ వేయాలని కోరినా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేంద్రానికి ఇప్పటివరకు కార్యాలయమే లేదు.ప్రస్తుతం ఉద్యోగులు తాత్కాలికంగా ఏరువాక కేంద్రంలో సర్దుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణాలు, విత్తనాలు నిల్వచేసేందుకు గోదాములు ఇలా అనేక వసతులు కల్పించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలకు ఇబ్బందులు
వ్యవసాయ పరిశోధనాస్థానం ఉత్పత్తి చేసే విత్తనాలతోపాటు వివిధ రకాల ఫౌండేషన్, బ్రీడర్ విత్తనాలు లభించేవి. వాటిని రైతువారీగా తాము సాగు చేసుకుని తరువాత ఇతర రైతులకు విత్తనాలు విక్రయించేవాళ్లం. అలాంటి పరిశోధనాస్థానం కేవలం పాలకుల వైఫల్యం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితులు దాపురించాయి. వెంటనే ఆ భూములకు సాగునీరు సౌకర్యం కల్పించాలి. లేదంటే వేరేచోట భూములు కేటాయించాలని కోరుతున్నాం.
చీడేపూడి ఏడుకొండలు, రైతు,మల్లవోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం