సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు.
తలలు పట్టుకుంటున్న పోలీసులు
పెనమలూరు, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. ఇదే తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాకు వస్తుండడంతో ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారికి ఇబ్బంది ఎదురైంది. ఇతర జిల్లాల్లో ఓటున్న పోలీసులకు మచిలీపట్నంలో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించగా.. పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నవారికి పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కేటాయించారు. ముఖ్యమంత్రి పర్యటన కారణంగా సిబ్బంది, అధికారులు బందోబస్తుకు వెళ్లాల్సి రావడంతో వీరంతా ఓటు హక్కు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొనే అధికారులు, సిబ్బందికి కనీస సమయం నాలుగు గంటలు పడుతుంది. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తును పూర్తి చేసుకొని ఓటు హక్కు వినియోగించుకొనే సమయం ఉంటుందా? ఉండదా? లేక మరోరోజు తమకు వకాశాన్ని కల్పిస్తారా? అన్న సందేహం వీరిలో ఏర్పడుతోంది. పెనమలూరు నియోజకవర్గంలో 130 మంది వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది సోమవారం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం