పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు.
ఎస్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. ఈశ్వర్ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ పేర్ని, ఆయన కుమారుడు కిట్టూ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏపార్టీలో ఉన్నా నియోజకవర్గంలో ఏ ఒక్కరినీ ఎదగనీయకుండా చేసి కుటుంబ వారసత్వానికే పెద్దపీట వేసుకుంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని టిక్టాక్స్టార్గా పేరు తెచ్చుకున్న కుమారుడు కిట్టూను రంగంలోకి దింపారనీ, గంజాయిబ్యాచ్ను వెంటేసుకుని తిరిగే ఆయనకు ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టదన్నారు.
పోర్టు నిర్మించాకే ఓటు అడుగుతానని చెప్పి..
మచిలీపట్నంలో అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి రూ.5 కోట్లు నిధులు మంజూరైతే అవి ఏమయ్యాయో తెలియకుండా చేశారన్నారు. పోర్టు నిర్మించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానంటూ హామీ ఇచ్చి మళ్లీ ఓటు రాజకీయం కోసం పోర్టు పనులు 10 శాతం కూడా పూర్తిచేయకుండా ఎలా ప్రజలకు ముఖం చూపిస్తున్నారో చెప్పాలన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో అకృత్యాలు, అరాచకాలు, దోపిడీలు, బెదిరింపులు, హత్యలకు గురవుతూ రాజ్యాంగ కల్పించిన హక్కులను కూడా దూరం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎస్ఎస్డీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్షిండే మాట్లాడుతూ పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గం అభివృద్ధికి ఏమి చేయలేదన్నారు. ఎస్ఎస్డీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
జగన్కు ఓటేస్తే ఐదేళ్లు మళ్లీ నరకం
పెడన, న్యూస్టుడే: వైకాపాకు ఓటేస్తే రానున్న ఐదేళ్లు ప్రజలు మరింత నరకం చవిచూడక తప్పదని సమతా సైనిక్ దళ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు పేర్కొన్నారు.. ఆదివారం పెడనలో పర్యటించిన ఆయన ఎస్సీ కాలనీలకు వెళ్లి ప్రజలను చైతన్యపర్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటేయవద్దని ఆపార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచించారు. అనంతరం స్థానిక వీరభద్రపురం కర్ణభక్త కల్యాణ మంటపంలో విలేకర్లతో మాట్లాడారు. జగనన్న కాలనీల పేరిట ఎస్సీలకు చెందిన 12వేల ఎకరాల భూముల్ని బలవంతంగా ప్రభుత్వం తీసుకుందని తద్వారా ఎస్సీలు ఉపాధిని కోల్పోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ షిండే, స్థానిక నేతలు కమ్మగంటి వెంకటేశ్వరరావు, బొడ్డు చినబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.