డబ్బులు పంచుతూ.. స్టిక్కర్లు అంటిస్తూ..
ఇంటింటికీ ప్రచారం పేరుతో వైకాపా స్టిక్కర్లు అంటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులపైనే వైకాపా నాయకులు తప్పుడు కేసులు బనాయించారు.
వైకాపా నాయకుల అరాచకం
అడ్డుకున్న తెదేపా నాయకులపై కేసు
పాయకాపురం (మధురానగర్), న్యూస్టుడే : ఇంటింటికీ ప్రచారం పేరుతో వైకాపా స్టిక్కర్లు అంటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులపైనే వైకాపా నాయకులు తప్పుడు కేసులు బనాయించారు. వివరాల్లోకి వెళితే... ఎన్డీయే కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు తనయుడు రవితేజ మంగళవారం ఉదయం 62వ డివిజన్, రాధానగర్లో ప్రచారం చేస్తున్నారు. వైకాపా నాయకులు కరుణశ్రీ, జ్యోతి, చిన్ని తల్లి మరికొంత మంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు ఇస్తూ, స్టిక్కర్లు అంటిస్తూ డబ్బులు పంచుతున్నారు. దీన్ని గుర్తించిన స్థానికులు.. తెదేపా నాయకులకు సమాచారం అందించారు. బొండా రవితేజ మరికొందరు అక్కడకు వెళ్లి ప్రశ్నించడంతో.. వైకాపా నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. స్టిక్కర్లు అంటించేందుకు అనుమతి ఉందా? అని అడిగితే కొట్టారంటూ షేక్ మస్తాన్ అనే తెదేపా నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని అడ్డుకున్నందుకు బొండా రవితేజను కూడా దుర్భాషలాడారన్నారు. తనను ఎన్నికలు అయ్యేలోపు ఖతం చేస్తామంటూ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, మరికొంత మంది బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో షేక్ మస్తాన్ పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. రాధానగర్లో తెదేపా, వైకాపా నాయకుల ఘర్షణతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బొండా రవితేజ ఇతర నాయకులు నున్న పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు అతనిని స్టేషన్లో కూర్చోపెట్టారు. వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. బొండా ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా నాయకులు వందలాది మంది విచ్చేశారు. ఇరువర్గాలు ఎదురెదురు పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టాస్క్ఫోర్స్ పోలీసులు సైతం వచ్చారు. బొండా రవితేజపై ఫిర్యాదు చేయాలంటూ చెప్పి వెలంపల్లి వెళ్లిపోయారు. బొండా ఉమా సోదరుడు బొండా శ్రీనివాసరావు, తెదేపా ఫ్లోర్లీడర్, న్యాయవాది నెల్లిబండ్ల బాలస్వామిలు కూడా స్టేషన్కు వచ్చారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
కులం పేరుతో దూషించారని మహిళలు ఫిర్యాదు.. 62వ డివిజన్ లచ్చిరెడ్డి పిండి మర వెనుక వీధిలో.. బొండా రవితేజ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తుండగా వైకాపాకు చెందిన పలువురు బాలికలతోపాటు మాతా మహేష్, ఎస్.కె.మస్తాన్ (పొట్టి మస్తాన్)లు తమను అడ్డుకున్నారని చొప్పర వరలక్ష్మి నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది మా ప్రాంతమని, తెదేపా వాళ్లు ప్రచారం చేయాలంటే మా అనుమతి తీసుకోవాలంటూ వైకాపా నాయకులు అడ్డుకున్నారు. వెళ్లకపోతే చంపుతామని బెదిరించారని, కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇష్టానుసారం కొట్టారు. మేరి, కుమారి, బోను కుమారి, రమణమ్మ అనే కార్యకర్తలపై దాడి చేశారని, మాతా మహేష్, ఎస్.కె.మస్తాన్ (పొట్టి మస్తాన్)లు తమ దుస్తులు లాగి అసభ్యంగా ప్రవర్తించారని చొప్పర వరలక్ష్మి ఫిర్యాదు చేశారు.
బాలికలతో పంపిణీపై సర్వత్రా ఆగ్రహం.. బాలికలతో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకుల ప్రచారానికి పిల్లలు తప్ప పెద్దలు రావడం లేదా? అని పలువురు ప్రశ్నించారు. తెదేపా నాయకులు అడ్డుకోవడం.. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బాలికలు బెంబేలెత్తిపోయారు. బిక్క ముఖాలతో నిలబడ్డ వీరితోనే.. వైకాపా నాయకులు రాజకీయం చేయడం చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..