logo

బుద్ధప్రసాద్‌, బాలశౌరిలను గెలిపించండి: దేవినేని

కూటమి అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం చల్లపల్లి మండలం మంగళాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 04:54 IST

చల్లపల్లి, న్యూస్‌టుడే: కూటమి అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం చల్లపల్లి మండలం మంగళాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి బుద్ధప్రసాద్‌, బందరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరిలను గెలిపించాలని కోరారు. పాత, కొత్త మాజేరు, నూకలవారిపాలెం, లక్ష్మీపురం, చింతలమడ గ్రామాల్లో బుద్ధప్రసాద్‌, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కుమారుడు అనుదీప్‌ రోడ్‌షో నిర్వహించారు. పాత మాజేరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు