ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వంతోనే తిరిగి గాడిలో పెట్టగలమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
గాడిలో పడాలంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వమే మార్గం
ఐక్యత చాటుతున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, పద్మశ్రీ, అభ్యర్థులు వెంకటేశ్వరరావు, కృష్ణ
దావాజీగూడెం (గన్నవరం గ్రామీణం), న్యూస్టుడే: ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వంతోనే తిరిగి గాడిలో పెట్టగలమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పట్టణ శివారు దావాజీగూడెంలో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు, బందరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వింతా సంజీవరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నరసింహారావులతో కలిసి సీతారం ఏచూరి ప్రసంగించారు. మతోన్మాద భాజపాను గద్దె దింపేందుకు దేశంలోని 26 పార్టీలతో ఇండియా కూటమి బ్లాక్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టిస్తున్న భాజపాను ఇంటికి పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అన్నదమ్ముల్లా మెలిగే హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతోందన్నారు. గడిచిన పదేళ్లలో భాజపా సర్కార్ ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప.. చేసిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదరి రామకృష్ణ విమర్శించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏఒక్కటీ భాజపా నెరవేర్చలేదన్న రామకృష్ణ.. కల్ల్లబొల్లి మాటలతో ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొట్టి తిరిగి అధికారం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం అని పదేపదే చెబుతున్న ఒక్క రెడ్డి సామాజికవర్గానికి తప్ప ఇతర కులాలన్నింటినీ పాతాళానికి తొక్కారని ఆరోపించారు. ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఇతర నేతలు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.