logo

చింతమనేనిపై పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దెందులూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు జనసేన శ్రేణులంతా ఓట్లు వేసి గెలిపించాలని పవన్‌ సూచించారు.

Updated : 09 May 2024 12:34 IST

హనుమాన్‌ జంక్షన్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో బుధవారం నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. దెందులూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను జనసేన శ్రేణులంతా ఓట్లు వేసి గెలిపించాలని పవన్‌ సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురించి పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఇద్దరి మైత్రి గొడవతో ఆరంభమైంది. చింతమనేని అంటే నాకు చాలా ఇష్టం. నేను దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే గెలిపించే బాధ్యత తనదని అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు.’ అని పవన్‌ అనడంతో సభలోని వారంతా ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌, నూజివీడులో పార్థసారథిని మంచి మెజార్టీతో గెలిపించాలనీ, జనసేన మద్దతుదారులంతా అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని