logo

ఆటోను ఢీకొన్న లారీ, చోదకుడి దుర్మరణం

ఆటోను లారీ ఢీకొనడంతో నవీన్‌ (26) అనే ఆటో చోదకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కణేకల్లు రోడ్డులో నివాసముంటున్న నవీన్‌ ఆటో నడుపుతూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు.

Published : 15 Jan 2022 05:50 IST


నవీన్‌ (దాచినచిత్రం)

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: ఆటోను లారీ ఢీకొనడంతో నవీన్‌ (26) అనే ఆటో చోదకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కణేకల్లు రోడ్డులో నివాసముంటున్న నవీన్‌ ఆటో నడుపుతూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. శుక్రవారం బంధువులను ముత్రాసికాలనీలో వదిలి ఇంటికి తిరుగుపయనమయ్యాడు. లక్ష్మీబజారు పెట్రోలు బంకు సమీపంలో ఆటోను కుడివైపుకు తిప్పుతుండగా అనంతపురం వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో చోదకుడు, సమీప బంధువు చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. నవీన్‌ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్‌ కోలుకుంటున్నట్లు బంధువులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని