పోలీసుల అత్యుత్సాహం
హిందూపురం గ్రామీణ మండలం రాచపల్లి వద్ద జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం సాయంకాలం తనిఖీకి వెళ్లారు.
జూదమాడటానికి వచ్చాడని రైతుపై దాడి
గాయపడిన రైతు సోమశేఖర్
హిందూపురం, న్యూస్టుడే: హిందూపురం గ్రామీణ మండలం రాచపల్లి వద్ద జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం సాయంకాలం తనిఖీకి వెళ్లారు. అక్కడ కొందరు జూదరులు పట్టుబడ్డారు. ఆ సమయంలో అదే దారిలో పొలం వద్దకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న రైతు సోమశేఖర్ను జూదం ఆడటానికి వచ్చాడని భావించి పోలీసులు పట్టుకొన్నారు. ఆయన భయపడి పారిపోవడానికి యత్నించడంతో పోలీసులు తీవ్రంగా కొట్టి స్టేషన్కు తీసుకొచ్చారు. కంటి వద్ద గాయాలు కావడం, చేయి విరగడాన్ని పోలీసులు స్టేషన్లో గుర్తించారు. దీనికి తోడు జూదంతో రైతుకు సంబంధం లేదని తెలుసుకొన్న అధికారి, వెంటనే రైతును ఆసుపత్రిలో చేర్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. రైతును కొట్టిన విషయం వివాదాస్పదం కావడంతో మిగిలిన జూదరులనూ వదిలేశారు. తాము దాడులకే వెళ్లలేదని చెప్పుకోవడానికి ఇలా చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు తనపై దాడి చేసిన విషయమై రైతు, వారి బంధువులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!