జగన్ పాలనలో అన్నీ కోతలే
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది.
రైతుకు రాయితీ.. యువతకు ఉపాధి మాయం
పొలంలో తుంపర సేద్య పరికరాలు అమర్చుతున్న ఆంజనేయులు తదితరులు (పాత చిత్రం)
కదిరి, నల్లచెరువు, న్యూస్టుడే: యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. కొత్తగా ఉపాధి కల్పన చర్యలు దేవుడెరుగు.. ఉన్నవాటికీ మంగళం పాడుతూ యువతకు, అటు రైతుకు తీవ్ర నష్టం మిగిలిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రైవేటు రంగాల్లో పనులు చేసుకుంటున్న యువతకూ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురైంది. దీనికితోడు గడచిన ఐదారు నెలల కష్టానికి వేతనాలు కూడా రాకపోవటంతో లబోదిబోమనే దయనీయం నెలకొంది. ఐదేళ్ల కిందట తెదేపా హయాంలో ఏపీఎంఐపీ పర్యవేక్షణలో రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను 90 శాతం రాయితీతో అందించింది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో రైతుల పంటల సాగుకు సులువుగా ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి నిర్లక్ష్యం ఆవహించింది. ఫలితంగా రైతులకు రాయితీ సదుపాయం, బిందు, తుంపర సేద్య పరికాల కంపెనీల్లో పనిచేసే యువతకు ఉపాధి లేకుండాపోయింది. సూక్ష్మసేద్య సామగ్రి ఏడెనిమిది కంపెనీల నుంచి వచ్చేవి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆయా కంపెనీలకు ఎఫ్సీఓలుగా 25 మంది వరకు ఉన్నారు. కంపెనీలకు రైతులకు మధ్య ఉండే డీలర్లకు రావాల్సిన సొమ్ములు ఆగాయి. వేలాదిమంది రైతులకు రాయితీ పరికరాలు అందక ప్రైవేటుగా కొనాల్సి వస్తోంది. దీంతో ప్రతి రైతు హెక్టారు సాగుకు రూ.1.60 లక్షల దాకా బిందు సామగ్రి భారం మోయాల్సి వస్తోంది. జగన్ రైతు భరోసా అంటూనే సాగు సామగ్రి రాయితీ ఇవ్వకుండా వెన్ను విరిశాడని, సంబంధిత సామగ్రి కంపెనీల్లో పనిచేసే యువతకూ ఉపాధి దెబ్బతీశాడని వాపోతున్నారు.
రూ.5 లక్షల బకాయి రావాలి
కొఠారి కంపెనీలో బిందు, తుంపర సేద్య పరికరాల డీలరుగా ఉన్నాను. ప్రభుత్వం రైతులకు రాయితీ ఇస్తున్నప్పుడు బాగుండేది. రాయితీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇప్పటికే రైతులకు అందించిన సామగ్రికి సుమారు రూ.5 లక్షల వరకు రావాల్సి ఉంది. ఎంతో కొంత కమీషన్పై ఆధారపడి చేసే వ్యాపారం ప్రభుత్వ తీరుతో దెబ్బపడింది. కంపెనీలకు బకాయితో మాలాంటి డీలర్ల ఆదాయంపై ప్రభావం పడింది.
లక్ష్మీపతి, డీలరు
ఆర్నెల్ల జీతభత్యాలు రాలేదు..
వైకాపా ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర పరికరాల రాయితీ పథకం ముందుకు తీసుకెళ్లని ఫలితం కారణంగా మాలాంటి యువత ఉపాధిపై దెబ్బ పడింది. సిగ్నెట్ కంపెనీలో క్షేత్ర సమన్వయ అధికారిగా పనిచేశాను. నెలకు రూ.13 వేల వేతనం, రూ.8,500 టీఏ, డీఏ అలవెన్సులు ఇచ్చేవారు. అక్టోబరు నుంచి ఇప్పటి దాకా వేతనాలు ఆపేశారు. ఆర్నెళ్ల జీతాలు రాకపోవడంతో కుటుంబ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతోనే ప్రైవేటులో పనిచేసే యువత ఉపాధిపై ప్రభావం పడటంతో కష్టాలు పడుతున్నాం.
ఆంజనేయులు, ఎఫ్సీఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం గుర్తింపు
[ 01-05-2024]
పెనుకొండ నియోజకవర్గం రొద్దం పంచాయతీ పరిధిలోని పెద్దగువ్వల పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. -
అవ్వాతాతల పింఛన్లపై జగన్నాటకం
[ 01-05-2024]
ఏ బిడ్డ కన్నవారిని కష్టపెట్టాలనుకోడు. ఏ మనవడు అవ్వతాతల్ని మండుటెండలో నిల్చోబెట్టి మాడ్చాలని కోరుకోడు. ఏ సోదరుడు అక్కాచెల్లెమ్మలను ఇబ్బంది పెట్టాలని తలంచడు.నోరు తెరిస్తే మీ బిడ్డనంటూ దీర్ఘాలు తీసే సీఎం జగన్ మాత్రం అవ్వాతాతలు, -
జగన్ పాలనలో 108 కుయ్యో.. మొర్రో
[ 01-05-2024]
108కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్బన్ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్ బాధితులు ఇచ్చిన అడ్రస్కు చేరుకోవాల్సి ఉంది. -
దుర్గంలో ఎర్రమట్టి దోపిడీ
[ 01-05-2024]
రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. -
వంతెన హామీకి రెండున్నరేళ్లు
[ 01-05-2024]
అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని బుక్కరాయసముద్రం వద్ద వంకపై వంతెన నిర్మాణానికి వైకాపా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది. -
జాలిలేని జగన్ మామ..
[ 01-05-2024]
మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు. -
పల్లెల ప్రగతిపై ప్రభుత్వం నిర్లక్ష్యం
[ 01-05-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి గ్రామాలు పెద్దవి. -
బలిజలకు జగన్ వెన్నుపోటు పొడిచారు
[ 01-05-2024]
గత తెదేపా హయాంలో బలిజలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచి బలిజలను సర్వం నాశనం చేశారని కాపు సంఘం రాష్ట్ర ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు. -
అరాచక పాలనకు అంతం పలుకుదాం
[ 01-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు అంతం పలుకుదామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం పరిటాల సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
బరిలో పెరిగిన పోటీదారులు
[ 01-05-2024]
జనాలకు రాజకీయాల పట్ల ఆసక్తి నానాటికి పెరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. -
‘ఆశీర్వదించండి.. 114 చెరువులను నింపుతా’
[ 01-05-2024]
ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే రెండున్నరేళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతానని, రహదారులను బాగు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 01-05-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భారీగా నగదు పట్టివేత
[ 01-05-2024]
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంత అర్బన్ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. -
రానున్న మూడ్రోజుల్లో తీవ్ర వడగాలులు
[ 01-05-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. -
‘ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం’
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి మంగళవారం విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికి సమ ప్రాధాన్యం కల్పించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజినప్ప పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్