logo

‘ఆశీర్వదించండి.. 114 చెరువులను నింపుతా’

ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే రెండున్నరేళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతానని, రహదారులను బాగు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 01 May 2024 03:56 IST

ఎద్దులబండిపై ప్రచారం చేస్తున్న అమిలినేని

శెట్టూరు, న్యూస్‌టుడే: ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే రెండున్నరేళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతానని, రహదారులను బాగు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. శెట్టూరు మండలం చిన్నంపల్లి, బచ్చేహళ్లి, గొల్లలదొడ్డి, లింగదీర్లపల్లి, కైరేవు, చెర్లోపల్లి, మాలేపల్లి, లక్ష్మంపల్లి, యర్రబోరేపల్లి, కంబాలపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఫాదర్‌ఫెర్రర్‌, వాల్మీకి మహర్షి, కనకదాస విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ మంత్రి ఉష ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను పోలీసులతో భయపెట్టడం, కేసుల్లో ఇరికించడం, దోచుకోవడం తప్పా చేసిందేమీ లేదన్నారు. ఎంపీగా తలారి రంగయ్య ఐదేళ్లలో నియోజకవర్గం తిరిగిన దాఖలాలు, చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో చిన్నంపల్లి, శెట్టూరు సర్పంచులు అనురాధ, ఉరాల కుమార్‌, ములకలేడు ఎంపీటీసీ సభ్యుడు లింగప్ప, కన్వీనర్‌ తిప్పేస్వామి, నాయకులు రాజ్‌గోపాల్‌, రామ్మోహన్‌, రామరాజు, శివశంకర్‌, వెంకటేశులు, చంద్ర, చెన్నారెడ్డి, అశ్వర్థ, కుబేర్‌యాదవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని