దుర్గంలో ఎర్రమట్టి దోపిడీ
రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు.
వైకాపా నాయకుల బరితెగింపు
నాన్చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టరులో నింపుతూ...
రాయదుర్గం, న్యూస్టుడే: రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
రాయదుర్గం పట్టణ సరిహద్దున మొలకాల్మూర్ రోడ్డులో నాన్ చెరువు ఉంది. ఇది నిండితే 74.ఉడేగోళం చెరువుకు, వేలాది బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. రెండేళ్లుగా వర్షాలు రాకపోవటంతో చెరువు ఖాళీ అయ్యింది. దాంతో అధికార పార్టీ నాయకుల పంట పండింది. చెరువులో 10 నుంచి 15 అడుగుల లోతు వరకు మట్టి తవ్వకాలు జరిపారు. ఆ మట్టిని పట్టణంలోనూ, కర్ణాటకలోని మొలకాల్మూర్లోని ఇటుకల బట్టీలకు తరలించి రూ.లక్షలు ఆర్జించారు. అక్రమార్కులకు స్థానిక రెవెన్యూశాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు మధ్యలో ఒక రోడ్డు తప్పా మిగిలిన ప్రాంతమంతా తవ్వేశారు. కట్ట ముందు కనీసం పది అడుగుల స్థలం వదలాల్సి ఉంది. అయితే కట్టను ఆనుకుని మట్టిని తరలిస్తుండటంతో వరదనీటితో కట్టకు పైపింగ్ ఏర్పడి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. గతంలో కట్ట తెగిపోతే రైతులు చందాలు వేసుకొని మరమ్మతులు చేశారు. పట్టణ సమీపంలోని బొమ్మక్కపల్లి, మల్లాపురం చెరువు, గుమ్మఘట్ట మండలం రంగసముద్రం చెరువు పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది.
ఎక్కడెక్కడ తవ్వారంటే...: రాయదుర్గం పట్టణంలోని గౌడ లేఅవుట్ వద్ద ఉన్న జగన్న కాలనీ, మల్లాపురం లేఅవుట్, అడిగుప్పరోడ్డు, ఎంసీఏ లేఅవుట్ వద్ద కొండపైన, జాతీయ రహదారి పక్కన ఉన్న కొండలో, జగనన్న లేఅవుట్ల సమీపంలోని ఖాళీ స్థలాల్లో ఎర్రమట్టి కోసం తవ్వేశారు.
వాటాలు వేసుకొని..
నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన కొందరు నాయకులు ఎర్రమట్టిని దోచారు. నాకిది.. నీకిది అన్నట్లు కొండలను పంచేసుకుని మట్టిని లూటీ చేశారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు సర్వే నంబరు 502-1, 503-2,504-3లో ఉన్న కొండలో మట్టిని తరలించి, బోడి కొండను మిగిల్చారు. ప్రస్తుతం కొండలో బండ రాళ్లు మిగలడంతో వర్షం వస్తే నీరు కాలనీల్లో ప్రవేశిస్తోంది. ఇక్కడ పట్టపగలే పొక్లెయిన్లు, వందకుపైగా ట్రాక్టర్లతో పెద్దఎత్తున మట్టి తరలించినా రెవెన్యూ శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. వారికి పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.
కణేకల్లు రోడ్డుపైభాగాన సర్వేనంబరు 491లో గౌడ లేఅవుట్కు వెళ్లే మార్గంలోని అయ్యప్ప కొండను ఇష్టారాజ్యంగా తవ్వారు. ట్రాక్టరు మట్టిని రూ.1200కు పట్టణంలోని ఇళ్ల నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లకు విక్రయించారు. తవ్విన ప్రదేశాన్ని చదును చేసి సుమారు వంద ప్లాట్ల దాకా వేశారు. ఒక్కో ప్లాటును రూ.40 వేల చొప్పున విక్రయించినట్లు తెలిసింది. ఇక్కడ 10-15 అడుగుల లోతు దాకా మట్టి తవ్వారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు పడిన కష్టాలే నేడూ..
[ 22-05-2024]
పాఠశాలలు వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్నాయి. నాడు-నేడు పథకం కింద చేపడుతున్న పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. -
ఎన్ఐఏ సోదాలతో దుర్గం ఉలికిపాటు
[ 22-05-2024]
రాయదుర్గంలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారుల సోదాలతో మంగళవారం ఉదయం పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నాగులకట్టవీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్లా ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతున్న విషయం దావనంలా పట్టణమంతా వ్యాపించింది. -
స్ట్రాంగ్ రూంల వద్ద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల పర్యవేక్షణ
[ 22-05-2024]
సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అనంతపురం పార్లమెంటు, 7 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాలకు అనంతపురం జేఎన్టీయూలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ క్రమంలో 24 గంటలు అక్కడే పలు అంచెల్లో సాయుధ పోలీసు బలగాలు ఉన్నాయి. -
గాలివాన బీభత్సం
[ 22-05-2024]
జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో అరటి తోటలు నేలవాలాయి. రైతులకు ఆపార నష్టాన్ని మిగిల్చింది. కొన్ని చోట్ల గెలలు కోతకు రాగా, మరికొన్ని తోటలు వారం, పది రోజుల్లో గెలలు కోయాల్సి ఉంది. ఈ తరుణంలో పంట నేలావాలవడంతో రైతులకు తీరని శోకం మిగిల్చింది. -
ఎనిమిది మంది జిల్లా బహిష్కరణ
[ 22-05-2024]
జిల్లాలో మట్కా నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుండటం, ఇతర రాష్ట్రాల మద్యాన్ని అక్రమంగా రవాణా చేసి విక్రయించడం, గూండాగిరీతో భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై జిల్లా ఎస్పీ గౌతిమి శాలి ఉక్కుపాదం మోపారు. -
అన్నదాతలకు చల్లని కబురు
[ 22-05-2024]
గతేడాది నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం సతమతమవుతున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తామని వెల్లడించింది. -
లెక్కలేసి.. విజయానికి బాటలేసి
[ 22-05-2024]
గణితం అంటే విద్యార్థుల్లో భయం పుట్టుకొస్తుంది. గణితంలోని సూత్రాలు, లెక్కలు చేసే విధానం అర్థం చేసుకొంటే ఎంతో సులువుగా అందులోని సమస్యలను పరిష్కరించవచ్చు. గణితం కేవలం ఆ సబ్జెక్టుకే మాత్రమే పరిమితం కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో కూడా ఉంటుంది. -
చిన్నవాన.. విద్యుత్తు సమస్యలు చానా
[ 22-05-2024]
చిన్నపాటి వర్షం పడినా కరెంటు సరఫరా ఆగిపోవాల్సిందే. ఉమ్మడి జిల్లాల పరిధిలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోక పోవటంతో గంటల తరబడి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. -
మామిడి కాయల లీజుదారుపై క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం
[ 22-05-2024]
ఖైదీల వ్యవసాయ క్షేత్రంలో మామిడి చెట్లకు కాసిన ఫలాలను విక్రయించుకునే హక్కును వేలంలో సొంతం చేసుకున్న నీలంపల్లికి చెందిన వైకాపా నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. -
తెదేపా నాయకుడిపై దౌర్జన్యకాండ
[ 22-05-2024]
శింగనమల మండలం చిన్నజలాలపురంలో ఇటీవల వైకాపాను వీడి తెదేపాలో చేరారనే అక్కసుతో వైకాపా నాయకుడు దౌర్జన్యానికి దిగారు. పది మంది అనుచరులతో మూడు వాహనాల్లో తెదేపా నాయకుడి ఇంటి వద్దకు వెళ్లి దుర్భాషలాడి భయభ్రాంతులను చేసి దాడికి యత్నించాడు. -
అద్దె ఎగవేతకు.. బతికుండగానే చంపేశారు!
[ 22-05-2024]
కొత్తచెరువు మేజరు పంచాయతీ కాంప్లెక్స్లో ఒక దుకాణం అద్దె బకాయి ఎగవేయడానికి బతికుండగానే చంపేసిన పంచాయతీ అధికారుల లీలలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. 2019లో పంచాయతీ షాపింగ్ కాంప్లెక్్్సలోని 40 గదులకు వేలం నిర్వహించారు. -
20 రోజుల్లో ఇంకేం పనులు చేస్తారప్పా
[ 22-05-2024]
పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో వైకాపా ప్రభుత్వం నాడు-నేడు కింద పనులు చేపట్టింది. మూడు విడతల్లో అన్ని పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమైంది. -
ప్రయోగశాలలున్నా.. అన్నదాతకు ప్రయోజనం సున్నా
[ 22-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన కదిరిలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్ భవనాన్ని నిర్మించారు. గతేడాది జులైలో ప్రారంభించారు. ల్యాబ్లో పరీక్షలకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని నియమించారు. అయితే వచ్చిన సామగ్రిని అమర్చటం, వైరింగ్ వంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. -
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
[ 22-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మాకు అడ్డూఅదుపు ఏముందని దాదాపు నెలరోజులుగా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో పెద్దఎత్తున పెన్నానది నుంచి ఇసుక తరలిస్తున్న ఇసుకాసురులు సీపీఐ, ప్రజాసంఘాల నాయకుల నిరసనతో తోకముడిచారు. -
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
[ 22-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు తెలిపారు. మంగళవారం ఆయన ఎస్పీ మాధవరెడ్డి, సంయుక్త కలెక్టర్ అభిషేక్కుమార్లతో కలిసి హిందూపురం సమీపంలోని బిట్ కళాశాల, లేపాక్షి మండలం చోళసముద్రం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంల వద్ద భద్రత, ఓట్లలెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు.