జగన్ పాలనలో 108 కుయ్యో.. మొర్రో
108కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్బన్ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్ బాధితులు ఇచ్చిన అడ్రస్కు చేరుకోవాల్సి ఉంది.
తరచూ మొరాయిస్తున్న అంబులెన్స్లు
సమయానికి రోగుల వద్దకు చేరక తప్పని తిప్పలు
108కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్బన్ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్ బాధితులు ఇచ్చిన అడ్రస్కు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఎక్కువ శాతం వాహనాలు అనుకున్న సమయానికి చేరుకోవడం లేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
అనంతపురం (వైద్యం), న్యూస్టుడే: ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కుయ్ కుయ్ అంటూ.. సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిన 108 వాహనాలు నిర్వహణ లేక, మరమ్మతులకు నోచుకోక కుయ్యి.. కుయ్యిమంటున్నాయి. ఆరోగ్యం బాగోలేకపోయినా, రోడ్డు ప్రమాదాలకు గురైనా.. బాధితులు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకురావడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 108 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ, వైకాపా పాలనలో 108 వాహనాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. వాహనాలు మరమ్మతులకు గురై ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో రోగులు, క్షతగాత్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యామ్నాయంగా ఉన్న అంబులెన్స్లకు మరమ్మతులు చేయకపోవటంతో అవి కూడా నిలిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా ..
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో మొత్తం 108 వాహనాలు 66 ఉన్నాయి. అలాగే నాలుగు అంబులెన్స్లు బ్యాకప్కు అదనంగా ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. టైర్లు పాతబడిపోవటంతో వేగంగా వెళ్లలేకపోతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. స్టెఫ్నీ టైర్లు అందుబాటులో లేకపోవడంతో టైర్ పంక్చరైతే ఇబ్బందులు తప్పడం లేదు. సగానికిపైగా పాత వాహనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవాటిలో రెండు నుంచి నాలుగు లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. 80 వేల కిలోమీటర్లు తిరిగిన వాహనాలకు టైర్లు మార్చాల్సి ఉంటుంది. టైర్లు అందుబాటులో లేవు. 108 వాహనాల పర్యవేక్షణ, నిర్వహణ మొత్తం బాధ్యతలను 2020 జులైలో ఒక ప్రైవేట్ సంస్థ టెండర్ను దక్కించుకుని నిర్వహిస్తోంది. కొన్ని అంబులెన్స్లకు సైరన్లు పనిచేయకపోవటంతో ట్రాఫిక్లో వాహనాలను త్వరితగతిన నడపలేని పరిస్థితి.
ఆలస్యం.. బలైన నిండు ప్రాణం
మడకశిర: నియోజకవర్గంలో 108 వాహనాల ఆలస్యం వల్ల ప్రమాదంలో ఉన్నవారు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. గత నెల 1న మడకశిర మండలం జమ్మానిపల్లిలో పెద్దరంగప్ప అనేవ్యక్తికి మొదట కడుపునొప్పి అంటూ 108 వాహనానికి కాల్ చేయగా కన్నడ భాషలో మాట్లాడారు. మరో చరవాణి నుంచి కాల్ చేయగా మడకశిరలో అంబులెన్స్ అందుబాటులో లేదని చెప్పారు. 10 కిలోమీటర్లు ఉన్న జమ్మానిపల్లికి 15 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం గంట ఆలస్యంగా వచ్చింది. వైద్యులు పరీక్షించి పెద్దరంగప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. కొన్నిచోట్ల వాహనాలు ఆలస్యంగా వస్తుండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఊడుతున్న చక్రాలు.. ఆగుతున్న వాహనాలు
కదిరి పట్టణం: కదిరి పరిసరాల్లోని వాహనాల్లో పాతవే ఎక్కువ. తరచూ మరమ్మతుకు గురవుతుండటం వల్ల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. తలుపుల వాహనం చక్రాలు పూర్తిగా పాతదైంది. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. 2023 మేలో కదిరి పట్టణంలో సైదాపురం వద్ద జాతీయ రహదారిపై తలుపుల మండలానికి చెందిన 108 వాహనం రోడ్డు మధ్యలో ఆగిపోయింది. వాహనం ముందు చక్రం ఊడిపోవడంతో చోదకుడు ఆపేశారు. మెకానిక్ సాయంతో రోడ్డుపైనే మరమ్మతు చేసుకోవాల్సి వచ్చింది.
మరమ్మతుకు ఐదారు రోజులు
రాప్తాడు: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు సర్వీస్ సెంటర్ రాప్తాడులో ఉంది. ఇక్కడకు రోజూ 5, 6 వాహనాలు మరమ్మతులకు వస్తుంటాయి. వాటిని రిపేరు చేయడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. రాప్తాడు సర్వీస్ సెంటర్కు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న కదిరి, గాండ్లపెంట, రాయదుర్గం వాహనాలు వచ్చినప్పుడు అక్కడ ప్రమాదాలు జరిగితే ప్రత్యామ్నాయంగా 108 అంబులెన్స్లు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు.
ప్రైవేటును ఆశ్రయించాల్సిందే..
కళ్యాణదుర్గం గ్రామీణం: నియోజకవర్గంంలో కళ్యాణదుర్గం 2, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాలకు ఒక్కో 108 వాహనం ఉంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే సమాచారం అందిస్తే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సమాచారం ఇచ్చినా గంటల తరబడి రాకపోవడంతో బాధితులు, క్షతగాత్రులు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు చేరుతున్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కాలం చెల్లిన వాహనం శిథిలావస్థకు చేరుతోంది.
పట్టించుకునేవారేరీ?
రాయదుర్గం పట్టణం: రాయదుర్గం వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన అంబులెన్స్ మరమ్మతుకు గురై 20 రోజులు గడుస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. రెండేళ్ల కిందట అన్ని మండలాలకు కొత్త అంబులెన్స్లు కేటాయించినప్పటికీ రాయదుర్గానికి ఇవ్వలేదు. దీంతో పాత వాహనాన్నే వినియోగించేవారు. ప్రస్తుతం పాడైంది. అంబులెన్స్ను అనంతపురానికి తరలించి 20 రోజులైనా పట్టించుకోవడం లేదు. మరోవైపు పాడైన ప్రభుత్వ అంబులెన్స్ అయిదేళ్ల నుంచి ఆసుపత్రి ఆవరణలో నిలిచిపోయింది. దాని గురించి పట్టించుకునేవారే లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం
[ 21-05-2024]
రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. -
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వేళాయె..
[ 21-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. -
మళ్లీ బాదుడు ..
[ 21-05-2024]
ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. -
పురం పారిశ్రామికవాడల్లో నీటికి కటకట
[ 21-05-2024]
శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్ హౌస్ వద్ద నీటిని పంపింగ్ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది. -
శాంతిభద్రతలు పర్యవేక్షించండి
[ 21-05-2024]
జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు పేర్కొన్నారు. -
పాతఏరులో కబ్జాదారుల పాగా
[ 21-05-2024]
హిందూపురంలోని పరిగి రోడ్లో ఉన్న పాతఏరులో ఆక్రమణదారులు తిష్ఠవేశారు. దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న ఈఏరు సగానిపైగా కబ్జాకు గురైంది. -
రెండేళ్లయినా సొంత భవనాల్లేవ్
[ 21-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటై 25 నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా విడుదల చేసిన పాపానపోలేదు. -
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
[ 21-05-2024]
భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు. -
ఏసీఎల్ తుదిపోరుకు ఇండియన్ సిక్సర్స్ జట్టు
[ 21-05-2024]
అనంత క్రికెట్ లీగ్ ఫైనల్కు ఇండియన్ సిక్సర్స్ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్ జట్టు ఫ్యామిలీ క్లబ్ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. -
శ్రీరామిరెడ్డి నీటిపథకం కార్మికుల సమ్మె బాట
[ 21-05-2024]
శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు -
ప్రభుత్వం విస్మరించింది.. ఆర్డీటీ నిర్మించింది
[ 21-05-2024]
శిథిలమైన చెక్డ్యామ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు. -
అనంతలో జోరు వాన
[ 21-05-2024]
జిల్లా కేంద్రం అనంత నగరంలో సోమవారం రాత్రి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. -
తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు
[ 21-05-2024]
పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ