జాలిలేని జగన్ మామ..
మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు.
90 శాతం పూర్తయిన గురుకుల భవనాలపై ఇంత కక్షనా?
గుడిబండలో అర్ధాంతరంగా ఆగిన బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనం పనులు
మడకశిర గ్రామీణం, గుడిబండ, న్యూస్టుడే: మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు. వాటి నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.27 కోట్ల వంతున కేటాయించారు. నియోజకవర్గంలోని మడకశిర మండలం గుండుమలలో మహాత్మాజ్యోతిబాఫులె బాలుర గురుకుల పాఠశాల, గురుకుల జూనియర్ కళాశాల, మండల కేంద్రమైన గుడిబండలో బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలు మంజూరుచేసి నిధులు విడుదల చేశారు. అప్పట్లో పనులు శరవేగంగా చేపట్టి 90 శాతం పూర్తి చేశారు.
గుండుమల వద్ద బాలుర గురుకుల భవన సముదాయం
వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రహణం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. అప్పటి నుంచి తట్టెడు సిమెంటు, ఇటుక వేయలేదు. ఒక్కో భవనానికి రూ.3 నుంచి రూ.5 కోట్ల మేర వెచ్చించి పూర్తిచేసి ఉంటే ఒక్కో విద్యాలయంలో 1,200 మంది విద్యార్థులు చదివేవారు. తెదేపాకు మంచిపేరు వస్తుందన్న అక్కసుతో జగన్ నిర్లక్ష్యం వహించారు. గుండుమల బాలుర గురుకుల పాఠశాలను మూడు విభాగాలుగా చేసి 5 నుంచి 7 వరకు ఆర్.అనంతపురం వద్ద ఓ భవనంలో, 8 నుంచి 10 వరకు మడకశిర డిగ్రీ కళాశాల భవన సముదాయంలోని కొన్ని గదుల్లో నిర్వహిస్తున్నారు. ఇంటర్ కళాశాలను ఎస్సీ బాలికల పాత హాస్టల్ భవనంలో అసౌకర్యాల నడుమ నిర్వహిస్తున్నారు. గుడిబండ బాలికల గురుకుల పాఠశాలను మడకశిర సమీపంలోని మెట్టిబండ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఓ భవనంలో, జూనియర్ కళాశాలను గుడిబండలోని బీసీ బాలుర పాత హాస్టల్ భవనంలో నిర్వహిస్తున్నారు. నాడు-నేడు అంటూ విద్యాభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించామని ప్రగల్బాలు పలికిన వైకాపా ప్రభుత్వం గురుకులాలపై నిర్లక్ష్యమెందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం
[ 21-05-2024]
రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. -
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వేళాయె..
[ 21-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. -
మళ్లీ బాదుడు ..
[ 21-05-2024]
ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. -
పురం పారిశ్రామికవాడల్లో నీటికి కటకట
[ 21-05-2024]
శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్ హౌస్ వద్ద నీటిని పంపింగ్ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది. -
శాంతిభద్రతలు పర్యవేక్షించండి
[ 21-05-2024]
జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు పేర్కొన్నారు. -
పాతఏరులో కబ్జాదారుల పాగా
[ 21-05-2024]
హిందూపురంలోని పరిగి రోడ్లో ఉన్న పాతఏరులో ఆక్రమణదారులు తిష్ఠవేశారు. దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న ఈఏరు సగానిపైగా కబ్జాకు గురైంది. -
రెండేళ్లయినా సొంత భవనాల్లేవ్
[ 21-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటై 25 నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా విడుదల చేసిన పాపానపోలేదు. -
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
[ 21-05-2024]
భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు. -
ఏసీఎల్ తుదిపోరుకు ఇండియన్ సిక్సర్స్ జట్టు
[ 21-05-2024]
అనంత క్రికెట్ లీగ్ ఫైనల్కు ఇండియన్ సిక్సర్స్ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్ జట్టు ఫ్యామిలీ క్లబ్ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. -
శ్రీరామిరెడ్డి నీటిపథకం కార్మికుల సమ్మె బాట
[ 21-05-2024]
శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు -
ప్రభుత్వం విస్మరించింది.. ఆర్డీటీ నిర్మించింది
[ 21-05-2024]
శిథిలమైన చెక్డ్యామ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు. -
అనంతలో జోరు వాన
[ 21-05-2024]
జిల్లా కేంద్రం అనంత నగరంలో సోమవారం రాత్రి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. -
తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు
[ 21-05-2024]
పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థే లేదా..?
-
విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి
-
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
-
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు