ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది.
ఉమ్మడి అనంత జిల్లాలో అంతులేని కష్టాలు
ఐదేళ్లుగా నియంత్రణ పట్టని జగన్ ప్రభుత్వం
ఈనాడు డిజిటల్, అనంతపురం: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. ఐదేళ్లలో ట్రాఫిక్ నియంత్రణ అనే పదాన్ని పూర్తిగా మరిచిపోయింది. అనంతపురం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, రాయదుర్గం తదితర పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం ట్రాఫిక్ రద్దీ వాహనదారుల్ని అవస్థలకు గురిచేస్తోంది. నియంత్రణ అస్తవ్యస్తంగా మారడంతో గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతం. ట్రాఫిక్ ఉన్నతాధికారులు కూడా నియంత్రణను గాలికొదిలేశారు. అంబులెన్సు వంటి అత్యవరస వాహనాలతో పాటు వృద్ధులు, పిల్లలతో వెళ్తున్నవారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
సిగ్నల్ వ్యవస్థ ఏదీ?
దేశంలోని చిన్నచిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పటిష్ఠపరిచారు. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయడం లేదు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిగ్నల్ వ్యవస్థ నిర్వహణకు నిధులు నిలిపివేసింది. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కరెంటు బిల్లులు మున్సిపాలిటీనే చెల్లిస్తుంది. నిర్వహణ మాత్రం ట్రాఫిక్శాఖ చూసుకుంటుంది. అభివృద్ధి పన్ను పేరుతో పురవాసుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. గతంలో ఈ మొత్తాన్ని స్థానికంగానే ఖర్చు చేసేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులను దారి మళ్లించారు. దీంతో మున్సిపాలిటీలు ట్రాఫిక్ నియంత్రణకు నిధులు కేటాయించడం లేదు. దీనికితోడు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించడం లేదు. కొందరిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్పై నియమించి మమ అనిపించేశారు.
అడ్డదిడ్డంగా వాహన రాకపోకలు
హిందూపురంక్రాస్లో అస్తవ్యస్తంగా రాకపోకలు
కదిరి: పట్టణంలో వాహనాల రద్దీ పెరుగుతోంది. లక్షకు పైగా జనాభా, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే 15 వేల నుంచి 20 వేల మంది జనాభాతోపాటు వేలసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలతో రోడ్లు కిక్కిరిస్తున్నాయి. దీనికితోడు శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శన భక్తుల వాహనాలు వస్తుంటాయి. కాలేజీ కూడలి నుంచి జీవిమాను కూడలి జాతీయ రహదారిపై ఉన్నాయి. బెంగళూరు మార్గంలో ఆలయం ఉంది. వ్యాపార సముదాయాలైన వలీసాబ్, ఇక్బాల్రోడ్లు 30 ఏళ్ల కిందట ఏర్పడినవి కావడంతో ఇరుకుగా మారాయి. రద్దీ నియంత్రణకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ లేకపోవటంతో వాహనాల రాకపోకలు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి.
అనంతలో నరకమే
గాంధీనగర్లో వాహనాల రద్దీ
అనంత నేరవార్తలు: జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంలో జనాభా ఏటా పెరుగుతోంది. తదనుగుణంగా వాహనాల సంఖ్య అధికమయ్యాయి. దీనికి తోడు నగరం విస్తరణతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. అందుకు ఇరుకైన రోడ్లు ఓ కారణమైతే, సిగ్నల్స్ వ్యవస్థ లేకపోవడం మరో కారణం. నగరంలో సిగ్నల్స్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సిగ్నల్స్ లేనిచోట్ల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో నిమిషాల తరబడి రోడ్లపై ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతూరులో గాంధీరోడ్డుతో పాటు, తిలక్ రోడ్డు, మార్కెటు రోడ్డు విస్తరణకు ఇప్పటికీ గ్రహణం వీడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఎవరిదారి వారిదే..
ధర్మవరం ఎన్టీఆర్ కూడలి వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు
ధర్మవరం: వాహనాల రాకపోకల రద్దీతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. తాడిపత్రి నుంచి ధర్మవరం మీదుగా బెంగళూరుకు భారీ వాహనాలు వెళుతున్నాయి. ఇసుక టిప్పర్లు ఇదే మార్గంలో వెళుతున్నాయి. దీంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు హడలెత్తుతున్నారు. రోడ్డు దాటాలంటే పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. లారీ డ్రైవర్లు పట్టణంలో దూసుకెళుతుండటంతో ద్విచక్ర వాహనదారులను ఢీకొంటున్నారు. ఏడాది కిందట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేశారు. జీవో ఇచ్చినా సిబ్బందిని నియమించకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య తక్కువగానే ఉంది. వాహనాల సంఖ్య పెరిగినా కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో ఎవరికిష్టం వచ్చిన దారిలో వారు వెళుతున్నారు.
బండి తీయాలంటే భయపడాల్సిందే..
దుకాణాల ముందు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు
రాయదుర్గం పట్టణం: పట్టణ జనాభాతోపాటు నిత్యం వేలాది మంది పట్టణానికి వస్తుండటం, వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపేస్తుండటంతో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పట్టణవాసులు బండి తీయాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. కట్టడి చేయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంతో ఇష్టమొచ్చినట్లు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. బళ్లారి నుంచి వచ్చే వాహనాలు నిత్యం రద్దీగా ఉన్న వినాయక సర్కిల్లోనే రిటర్న్ చేస్తుండటంతో ప్రతి అరగంటకు అయిదు నిమిషాలపాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వినాయక సర్కిల్ నుంచి తహసీల్దార్ రోడ్డుకు వెళ్లే దారిలో మిఠాయి దుకాణాల ముందు రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు ఆపేస్తుండటంతో ముందుకు కదలలేని పరిస్థితి.
ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితం
గుంతకల్లులోనూ అదే పరిస్థితి..
గుంతకల్లు: పట్టణ జనాభా 1.60 లక్షలుండగా అన్నిరకాల వాహనాలు 18 వేల వరకు ఉన్నాయి. ఇరుకైన రోడ్లు, కూడళ్లు ఎక్కువ. రహదారుల విస్తరణ జరగకపోవడంతో వాహన రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ఫలితంగా నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రించడానికి పదిమంది పోలీసుల అవసరం ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల కిందట మున్సిపల్ కౌన్సిల్లో నిర్ణయించారు. ఎన్టీఆర్ కూడలి నుంచి భారతీయ స్టేట్బ్యాంకు వరకు ప్రధాన రహదారిలో, ధర్మవరంగేట్, గుత్తి, కసాపురం రోడ్లలో డివైడర్లు ఏర్పాటు చేయలేదు. సెంట్రల్ లైటింగ్ సిస్టం కూడా లేదు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది.
- ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా: 45 లక్షలకుపైగా
- అన్నిరకాల వాహనాల సంఖ్య: సుమారు 12 లక్షలు
- జిల్లాలో ప్రధాన కూడళ్లు : 90
- ట్రాఫిక్ నియంత్రణ సిగ్నళ్లు: ఎక్కడా పనిచేయవు
- ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సింది: 250
- ప్రస్తుతం ఉన్నవారు: 110
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ విలువ రూ.4,080 కోట్లు
[ 02-05-2024]
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
ఇస్తే సులభం.. కుట్ర చేస్తే కష్టం
[ 02-05-2024]
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. -
ఈవీఎంలపై అపోహలు వద్దు
[ 02-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్వేర్తో తయారు చేసినట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్కుమార్, ఎన్నికల పరిశీలకులు అజయ్నాథ్ ఝు, మనీష్ సింగ్ తెలిపారు. -
కానుకలు ఎత్తివేత.. సరకుల్లో కోత
[ 02-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది. -
కొండను కొల్లగొట్టారు
[ 02-05-2024]
పామిడి మండలంలోని వంకరాజుకాలువ, నెమళ్లపల్లి గ్రామ కొండల్లో నుంచి ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. తాత్కాలిక అనుమతి పత్రాలు ఉన్నాయంటూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. రోజూ ఇరవై టిప్పర్ల వరకు మట్టిని తరలిస్తున్నారు. -
అధికార పక్షానికి పోలీసులు దాసోహం
[ 02-05-2024]
ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగపడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దాడులపై ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. -
ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి ఓటమి భయం : సునీత
[ 02-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఆయన సోదరులతో సొంత పార్టీ నాయకులనే బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారని, నియోజకవర్గంలో చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
తెదేపాతోనే మహిళల సంక్షేమం
[ 02-05-2024]
మహిళలు అభివృద్ధి పథాన నడవాలన్నా, వారు సంక్షేమాన్ని సమర్థంగా అందుకోవాలన్నా తెదేపాతోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
వైకాపా అరాచక పాలనను సాగనంపుదాం
[ 02-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. -
ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుదాం
[ 02-05-2024]
వైకాపా అవినీతి, అక్రమాల పాలనకు అంతం పలకాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని కెంచానపల్లి, జుంజురాంపల్లి, బీఎన్హళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. -
వైకాపా ప్రచారానికి వెళ్తున్న కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 02-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్భూపాల్ వివరాల మేరకు.. శెట్టూరు మండలం కనుకూరుకు చెందిన ఓబన్న, భార్య నాగమణి, కోడలు అనురాధ ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం వెళుతున్నారు. -
అనంతలో తెదేపా నాయకుడి అరెస్టు
[ 02-05-2024]
అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్పై దాడి చేయించాడనే కారణంతో వన్టౌన్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు. -
తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ
[ 02-05-2024]
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ముస్లింల నమ్మకద్రోహి జగన్’
[ 02-05-2024]
రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు నమ్మించి మోసం చేసిన ఘనత జగన్దేనని శాసనమండలి మాజీ ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ ఆరోపించారు. బుధవారం నగరం అనంత కన్వెన్షన్ హాలులో ముస్లిం, మైనారిటీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు