ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి పరిటాల సునీత
ప్రచారంలో మహిళలతో కలిసి సూపర్ సిక్స్ పథకాల ప్రతులను ప్రదర్శిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత
రామగిరి, న్యూస్టుడే: పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లి, కురుగుండ్లకాలనీ, పి.కొత్తపల్లి, పెద్దయ్యగారి కొట్టాల, దుబ్బార్లపల్లిలో గ్రామాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సునీతకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీ ఎన్నికల మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు సునీత వివరించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, గతంలో చేసిన తప్పు చేయొద్దని తెలిపారు. పేరూరు డ్యాం వర్షాలతో నిండితే తామే నింపినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పేరూరు డ్యాంకు రూ.800 కోట్లు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయని తాము తిరిగి అధికారంలోకి వచ్చిన పనులు చేపడుతామని తెలిపారు. తెదేపా నాయకులు మాజీ ఎంపీపీ ఆంజనేయులు, తెదేపా నాయకులు రంగయ్య, సుధాకర్ పాల్గొన్నారు. రామగిరికి చెందిన పలువురు వైకాపా శ్రేణులు బుధవారం పరిటాల సునీత సమక్షంలో తెదేపాలో చేరారు. వెంకటాపురంలో తెదేపా క్యాంపు కార్యాలయంలో వీరందరికీ సునీత కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 04-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. అన్నదాతలను నిలువునా ముంచేశాడు. -
రాప్తాడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం
[ 04-05-2024]
రాప్తాడు నియోజకవర్గ ఓపీవోల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఫాం (13ఏ)పై ఆథరైజేషన్ అధికారి ముద్ర లేకుండానే ఓట్లు వేయించారని ఆందోళన చేపట్టారు. -
రెండో రోజూ తప్పని నిరీక్షణ
[ 04-05-2024]
పింఛను సొమ్ము కోసం పండుటాకులు రెండో రోజూ అవస్థలు పడ్డారు. గురువారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాచిన చాలామందికి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లభించలేదు. -
తహసీల్దారు కార్యాలయానికి తాళం వేసి.. రైతుల రాస్తారోకో
[ 04-05-2024]
ఓబుళదేవరచెరువు తహసీల్దారు ఖాజాబీ తీరును నిరసిస్తూ శుక్రవారం కదిరి - హిందూపురం ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. -
పుత్రరత్నం.. చేసేవన్నీ అక్రమం
[ 04-05-2024]
నోరు తెరిస్తే మా అంత సుద్దపూసలు లేరని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొంటారు. -
ఎండిన నేలల్ని చూడవు.. రాలుతున్న కన్నీళ్లను ఆపవు
[ 04-05-2024]
అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెదేపా హయాంలో జరిగిన పలు కాలువలు, జలాశయాల నిర్మాణ పనులను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా అపేసింది. -
మాట తప్పి.. మడమ తిప్పి.. సంక్షేమ క్యాలెండరు మడత పెట్టి
[ 04-05-2024]
ఏ ఒక్క విద్యార్థీ ఫీజు కట్టలేదని చదువు మధ్యలోనే ఆపేయకూడదు. ఏ ఒక్క బిడ్డనూ కళాశాలలు ఫీజులు కట్టలేదని వేధించకూడదు. మీ బిడ్డల చదువుకు అయ్యే ఖర్చంతా మీ బిడ్డ జగన్ తీసుకొని మీరు అప్పుల పాలుకాకుండా త్రైమాసికం పూర్తి కాగానే మీ ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. -
ప్రకాశ్రెడ్డీ.. చేతనైతే వలసలు ఆపు : సునీత
[ 04-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి చేతనైతే వైకాపా నుంచి వలసలు ఆపుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. -
అసమర్థ నాయకుడిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 04-05-2024]
నియోజకవర్గం అభివృద్ధి మార్గాన పయనించాలంటే అసమర్థుడైన వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓడించాలని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
5న ధర్మవరానికి అమిత్షా, చంద్రబాబు, పవన్ రాక
[ 04-05-2024]
ఈ నెల 5న ధర్మవరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ వస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా భాజపా అధ్యక్షుడు జీఎం శేఖర్ తెలిపారు. -
అభివృద్ధి, సంక్షేమం.. సమతూకమే లక్ష్యం
[ 04-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో సామాన్య ప్రజల జీవనం అతలాకుతలం అయ్యింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి తగ్గట్లు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి జీవన ప్రమాణాలు పడిపోయాయని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ఐదేళ్లకొచ్చారు జగన్
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్కు హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలోనే. మిగిలిన సమయాల్లో ఇది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అనేది గుర్తు లేదు. -
2,350 ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 04-05-2024]
లోక్సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ సాఫీగా సాగిందని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష