logo

సాగు, తాగునీరు అందిస్తాం: అమిలినేని

కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చి రైతులకు సాగు నీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెదేపా  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 07 May 2024 05:04 IST

రోడ్‌షోలో మాట్లాడుతున్న అమిలినేని సురేంద్రబాబు

కుందుర్పి, న్యూస్‌టుడే: కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చి రైతులకు సాగు నీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెదేపా  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని తూముకుంట, బెస్తరపల్లి, కెంచంపల్లి, కలిగొళిమి, జంబుగుంపల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు పూలవర్షం కురిపించి, గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కువ శాతం రైతులు ఉన్నారని, వారికి సాగునీరు ఇచ్చి సరైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లు నిర్మిస్తామన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ధనుంజయ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లికార్జున, సర్పంచి రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు