ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు
జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను
ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్టుడే: జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. ‘ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాలతో.. చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు, ఎస్సైలు సుమన్, వసంతకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. పాత నేరస్థులపై నిఘా పెట్టడంతో పాటు నేరాలోచనలున్న వారిని గుర్తించి వారి కదలికలపై దృష్టి పెట్టాం. పక్కా సమాచారంతో మంగళవారం ప్రత్యేక బృందం సభ్యులు స్థానిక రెడ్డిగుంట వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా.. రెండు వాహనాల్లో నలుగురు యువకులు వస్తుండగా.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. వారు పారిపోయే ప్రయత్నం చేయగా బృందం సభ్యులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయారు. అందులో పట్టుబడిన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన కార్తిక్(26), వసంత్(23)లను విచారించగా కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. జిల్లాలో బైక్లను చోరీ చేస్తూ వాటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విక్రయిస్తూ.. జల్సాలు చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. వారి విచారణలో రూ.12 లక్షల విలువ చేసే ఆరు బుల్లెట్ వాహనాలు, రూ.14 లక్షల విలువ చేసే 12 బైక్లు స్వాధీనం చేసుకున్నాం. వారిని విచారిస్తుండగా.. మరికొన్ని వాహనాల వివరాలు వచ్చాయి. సుమారు 30 వాహనాలు వారికి సంబంధించిన వ్యక్తుల వద్ద ఉన్నట్లు తేలింది. త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటాం. పారిపోయిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేస్తాం’ అని వివరించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన బైక్ల చోరీ కేసును ఛేదించడానికి కృషి చేసిన సీఐ, ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే