బర్డ్లో సౌకర్యాల లేమి!
శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్)లో సరైన వసతుల్లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా క్యాంటీన్ అందుబాటు లేక ఆహార పదార్థాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్లుగా క్యాంటీన్, మందుల దుకాణాల కొరత
బర్డ్ ఆస్పత్రి భవనం
తిరుపతి(వైద్యం), న్యూస్టుడే: శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్)లో సరైన వసతుల్లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా క్యాంటీన్ అందుబాటు లేక ఆహార పదార్థాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. స్విమ్స్తోపాటు రుయాలో ఉచిత అన్న ప్రసాదాలు అందించే తితిదే.. తమ నిర్వహణలోని బర్డ్ ఆస్పత్రిలో ఉచిత ప్రసాదాలు అందజేయడం లేదు. ఉచితంగా అందక.. కొనుగోలు చేసేందుకు అవకాశం లేక రోగులు నానా పాట్లు పడుతున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక గదుల సమీపంలోనూ ఆహార పదార్థాలు అందుబాటులో లేవు.
బర్డ్ ఆస్పత్రికి దేశ వ్యాప్తంగా రోగులు వస్తుంటారు. ఎముకలు, మోకీళ్ల మార్పిడి, తుంటి, గ్రహణమొర్రి, గూనె శస్త్ర చికిత్సలతోపాటు పుట్టు అంగవైకల్యం ఉన్న వారికి ప్రత్యేక శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. రోజుకు సరాసరి 700 - 800 మంది ఓపీ నిమిత్తం వస్తుంటారు. ఇన్పేషంట్లుగా సుమారు 200 మంది ఉన్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రి వైద్యులతో పాటు దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులు సందర్శక వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. దానికి తోడు దాతల సహకారంతో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బర్డ్కు రోగుల సంఖ్య బాగా పెరిగింది.
అయినవారి కోసమా..
టెండర్ కాలపరిమితి పూర్తి కావడంతో బర్డ్ ఆస్పత్రిలో కొనసాగుతున్న క్యాంటీన్ 2019లో మూతపడింది. సమీపంలోని రుయా చిన్న పిల్లల ఆస్పత్రి, మెటర్నటీకి వచ్చే రోగులు కూడా ఇక్కడికి వచ్చి ఆహారపదార్థాలు కొనుగోలు చేసుకునేవారు. స్విమ్స్, బర్డ్ ఆస్పత్రి వైద్యులు ఇక్కడ అల్పాహారాలు, తేనీరు తీసుకునేవారు. అలాంటి క్యాంటీన్ అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన ఆహారం కోసం ప్రధాన మార్గంలోకి రోగులు రావాల్సి వస్తోంది. అప్పటి నుంచి అనేకసార్లు టెండర్లు నిర్వహించినా ఖరారు చేయలేదు. పలుమార్లు ప్రయత్నించినా టెండరుదార్ల నుంచి సానుకూలత లేదనే కారణంతో అయిన వారికి కట్టబెడతారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. సమీపంలో ఉన్న స్విమ్స్ క్యాంటీన్ నిర్వాహకులకు మేలు చేసే ఉద్దేశంతో క్యాంటీన్ ఖరారు పెండింగ్ కొనసాగిస్తున్నట్లు విమర్శలున్నాయి.
రోగులకు ఇబ్బందులే..
బర్డ్ ఆస్పత్రి ముందున్న మందుల దుకాణంతో తితిదేకి నెలకు రూ.40 వేల వరకు అద్దె వచ్చేది. 2019లో అప్పటి తితిదే ఉన్నతాధికారి జనరిక్ మందుల దుకాణం పేరుతో అదే మందుల దుకాణాన్ని ఆస్పత్రి ఆవరణలోకి మార్చారు. మందుల దుకాణంలో వచ్చే ఆదాయాన్ని నిర్వాహకుడు, తితిదే సగం తీసుకునేలా ఒప్పందంతో నెలకొల్పారు. ఆ కాల పరిమితి పూర్తి కావడంతో ఆ తర్వాత మందుల దుకాణం అందుబాటులోకి రాలేదు. రోగులు మందుల కొనుగోలుకు స్విమ్స్ ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇటీవల టెండరు నిర్వహించినా ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. రానున్న వేసవి కాలంలో మరింతగా మంచి నీటి సౌకర్యాలు మెరుగుపరచాలని రోగులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు